పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువు
ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరపగా అది కాస్త పూజా కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల చికిత్స తర్వాత పూజా తిరిగి వివాహ వేడుకలకు హాజరైంది.
తీవ్రంగా గాయపడిన పూజ కుడి కాలుకు పెద్ద బ్యాండేజీ కనిపించింది. అలా కుంటుతూనే వివాహం సందర్భంగా జరగాల్సిన మిగతా కార్యక్రమాల్లో పాల్గొంది. అగ్ని చుట్టూ పెళ్లికొడుకుతో కలిసి తిరుగుతున్న సమయంలో ఆమె నొప్పితో చాలా బాధపడింది. అలా కుంటుతూనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.దాదాపు 100 మంది అతిథులు ఈ వివాహానికి హాజరయ్యారు.

ఇదిలా ఉంటే పూజా వివాహం గతేడాది ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉండగా... పెళ్లి కొడుకు లక్ష్మణ్ సోదరుడు మృతి చెందడంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు పూజా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పెళ్లి కుమారుడు తరపున వచ్చిన అతిథులు సంబరాల సందర్భంగా తుపాకీతో గాల్లోకి కాల్చే ప్రయత్నం చేయగా అదికాస్త మిస్ఫైర్ అయి పూజా కాలికి తగిలిందని ఈస్ట్ డీసీపీ పంకజ్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని రింకుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. రింకూ అనే వ్యక్తి తనకు తెలియదని చెప్పిన పూజా... రింకూపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రింకు ఎవరో తనకు కూడా తెలియదని పెళ్లికుమారుడు తెలిపాడు.
పూజా ఇబ్బంది పడుతుండటంతో కాలు ఏమైనా బెసికిందని ముందుగా తాము భావించామని అయితే కాలునుంచి రక్తం కారుతుండటంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా ఆ గాయం బుల్లెట్ దూసుకెళ్లడంతో జరిగిందని తెలుసుకున్నట్లు పూజా తల్లిదండ్రులు చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడని పెళ్లి కుమారుడు లక్ష్మణ్ తెలిపాడు.అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications