వారానికి పైగా ఎల్జీ నివాసంలో ఆందోళన: ధర్నా విరమించిన కేజ్రీవాల్, మంత్రులు
ఢిల్లీ: వారం రోజులకు పైగా నిరసన దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విరమించారు. వరుస భేటీలు, చర్చల అనంతరం సమస్య పరిష్కారమైంది. జూన్ 11వ తారీఖు నుంచి కేజ్రీవాల్, మంత్రులు ధర్నా చేస్తున్నారు.
ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన చేస్తున్నారని, వారి ఆందోళలను విరమింప చేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోనే ధర్నా చేశారు. అలాగే పలు సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఈ నిరసన దీక్షలో భాగంగా ఇద్దరు మంత్రులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి కూడా తరలించారు. కేజ్రీవాల్ ధర్నాకు పలువురి నుంచి మద్దతు కూడా లభించింది.

ఐఏఎస్ అధికారులను వెంటనే కలిసి చర్చించాలని లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులు తిరిగి వర్క్ చేసేందుకు వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట గత వారానికి పైగా దీక్ష చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల ఆందోళనను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు దీక్ష విరమించడంతో మంత్రులు కూడా తిరిగి విధుల్లోకి వచ్చినట్లయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications