15 క్రేట్లు, రూ.30 వేలు: మామిడి పండ్లు దోచుకున్న కొందరు హస్తిన ప్రజలు, బోరుమన్న చిరువ్యాపారి
అసలే లాక్డౌన్.. దీంతో చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయం. ఇక పండ్లు విక్రయించే పరిస్థితి మరీ ఘోరం. ప్రజలు ఎక్కువ సమయం బయట ఉండటం లేదు.. ఉన్నా బేరం ఆడి కొనుగోలు చేస్తున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఓ పండ్ల విక్రేతను జన సమూహం మోసం చేసింది. అవును.. అక్కడ జరుగుతున్న గొడవను ఆసరాగా చేసుకొన.. అతని వద్ద గల మామిడి పండ్లను ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో అక్కడికి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గొడవను ఆసరాగా చేసుకొని..
ఢిల్లీ జగత్ పురి ప్రాంతలో చోటే అనే వ్యక్తి మామిడి పండ్లు విక్రయిస్తూ... కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే బుధవారం అతను పండ్లు అమ్మే దగ్గర గొడవ జరిగింది. లడాయి జరుగుతుందంటే.. అక్కడికి వెళ్లి సర్ది చెబుతుంటాం. అలా ఎవరీ పనిలో వారు బిజీగా ఉండగా సందట్లో సడేమియా అన్నట్టు పాదచారులు, ఆటో డ్రైవర్లు, మిగతా వారు కూడా మామిడి పండ్ల షాపు వద్దకొచ్చారు. అక్కడే గల క్రేట్లలో ఉన్న మామిడి పండ్లను పట్టపగలు ఎత్తుకెళ్లిపోయారు.

15 క్రేట్ల పండ్లు
చోటే అనే చిరు వ్యాపారి.. 15 క్రేట్ల మామిడి పండ్లను తీసుకొచ్చారు. దాని విలువ రూ.30 వేలు.. పళ్లు అమ్ముకొని కాస్త లాభం తెచ్చుకుందామనులోపే.. మావనరూపంలో ఉన్న దొంగలుపడీ చోరీ చేశారు. అలా పదుల సంఖ్యలో జనం వచ్చి మామిడి పండ్లను తీసుకెళ్తుంటే ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో చోటే ఉండిపోయారు. అయితే గొడవ జరిగే సమయంలో కొందరు వచ్చి అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారని.. వెళ్లేలోపే ఘటన జరిగిందని చోటే తెలిపారు.

హెల్మెట్లలో పండ్లు
బ్యాగులు లేని వారు.. హెల్మెట్లలో మామిడి పండ్లను తీసుకెళ్లారు. అలా అక్కడికి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వారు చేస్తున్న పనిని ఒకరు వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరలవుతోంది. అసలే వ్యాపారం లేదు అని.. ఈ సమయంలో చోరీ చేయడంతో తాను నష్టాల్లోకి వెళ్లిపోయానని చోటే చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications