మద్యం తాగించి మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్రేప్
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
40 ఏళ్ల బాధితురాలు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర, కండక్టర్ జితేంద్ర ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి ముందు బాధితురాలికి నిందితులు బలవంతంగా మద్యం తాగించారు. కాగా, బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు బస్సు వద్దకు చేరుకున్నారు. బాధితురాలిని కాపాడిన స్థానికులు, ఇద్దరు నిందితులను చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ప్రాణం తీసిన మెమొరీ కార్డు
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా తులసీపురంలో దారుణం జరిగింది. మెమొరీ కార్డు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్(16) అనే యువకుడు తన ఇంటికి సమీపంలోని శోభారామ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్లో నుంచి మెమొరీ కార్డును దొంగిలించాడు.
ఇది గమనించిన శోభారామ్.. అనిల్కు విషమిచ్చి దారుణంగా కొట్టాడు. ఇంటికి చేరుకున్న అనిల్ వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే అనిల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శోభారామ్ పరారీలో ఉన్నాడు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications