పెట్రోలు: దిల్లీలో లీటరుకు రూ. 8 తగ్గింపు - Newsreel
దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 8 రూపాయలు తగ్గింది.
పెట్రోల్పై 30 శాతంగా ఉన్న వ్యాట్ను 19.4 శాతానికి తగ్గిస్తూ దిల్లీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో లీటర్ పెట్రోల్కు 8 రూపాయలు ఆదా కానున్నాయి. తగ్గిన ధరలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ 103.97 ఉండగా, డీజిల్ను రూ. 86.67కు విక్రయిస్తున్నారు.
అదే సమయంలో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ ధర రూ. 94.14గా ఉన్నాయి.
ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత వీటి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరుసగా గత 27 రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.
https://twitter.com/ANI/status/1465934295994814476?t=j6DVP3mhcBulPleeDJA2aA&s=08
ఇవి కూడా చదవండి:
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)