నిర్బయ గ్యాంగ్ రేప్: ఇండియాస్ డాటర్స్ నిషేధించలేం
న్యూఢిల్లీ: నిర్బయ గ్యాంగ్ రేప్ స్టోరీ ఆధారంగా నిర్మించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ నిషేధంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హై కోర్టు చెప్పింది. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ నిషేధంపై జోక్యానికి న్యాయస్ధానం నిరాకరించింది.
2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్బయ గ్యాంగ్ రేప్ కేసు ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు మాయని మచ్చగా నిలిచిన నిర్బయ గ్యాంగ్ రేప్ స్టోరీని బీబీసీ ఇండియాస్ డాటర్ పేరిట డాక్యుమెంటరీ రూపొందించింది.
ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ పై వివాదం తలెత్తింది. డాక్యుమెంటరీ ప్రసారం విషయంలో కింద కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రసారం చెయ్యకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని హై కోర్టును ఆశ్రయించారు.
విచారణ పెండింగ్ లో ఉందని, అదే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఢిల్లీ హై కోర్టు వివరించింది. నిర్బయ గ్యాంగ్ రేప్ స్టోరీ ఆధారంగా బీబీసీ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ ప్రసారాల అనుమతిపై ఇప్పటికే ట్రయల్ కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది.