కుమార్ విశ్వాస్కు చుక్కెదురు: డిసిడబ్ల్యూ సమన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్కు జారీ చేసిన సమన్లపై స్టే విధించేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ వేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది.
హైకోర్టు తీర్పుతో కుమార్ విశ్వాస్ మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా వాలంటీర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు మే 4న మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్కు సమన్లు జారీ చేసింది.

కాగా, మే 7న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా కుమార్ విశ్వాస్ హాజరుకాకపోవడంతో మహిళా కమిషన్ అధిపతి బర్ఖా శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ మే 7న హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, బహిరంగంగా తమ సంబంధాన్ని చెప్పకుండా కుమార్ విశ్వాస్ తన జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పేర్కొంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications