భార్య, భర్త, ఓ హోం గార్డు: వివాహేతర సంబంధం ఉందని విషప్రయోగం, ముగ్గురి అరెస్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భర్తే మట్టుపెట్టేందుకు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. విష ద్రవం ఇచ్చిన ఇద్దరు మహిళలను, నిందితుడు ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ అలీపూర్లో ప్రదీప్ ఫ్యామిలీ ఉంటోంది. ఇతను భార్య సహా కుటుంబంతో ఉంటున్నాడు. అయితే తన భార్య హోంగార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రదీప్ భావించాడు. ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలని భావించాడు. తనకు తెలిసిన ఇద్దరు మహిళలను. వారికి పెద్ద మొత్తంలో నగదు ఆశచూపాడు. దీంతో వారు కూడా విష ద్రవం ఇచ్చేందుకు ముందుకొచ్చి.. హెల్త్ వర్కర్స్గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Recommended Video
ఆరోగ్య కార్యకర్తలను ఇంటికి తీసుకొచ్చిన ప్రదీప్.. వారు ఇచ్చే ద్రవం తాగాలని ఇంట్లోని ముగ్గురికి సూచించారు. అది కరోనా నివారణ మందు అని చెప్పడంతో.. వారు కూడా నమ్మి సేవించారు. తాగాక ఇబ్బందికి గురయ్యరు. వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరారు. కేసు విచారణలో భాగంగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హెల్త్ వర్కర్స్ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు వివరించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు.. ప్రదీప్ను అరెస్ట్ చేశారు.