Lady: వివాహిత మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ చెక్కేసి ? !
న్యూఢిల్లీ/గాజియాబాద్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త, పిల్లలతో కలసి నివాసం ఉంటున్నది. పనిమీద వెళ్లిన మహిళ రాత్రి ఇంటికి బయలుదేరింది. ఆ సందర్బంలో ఐదు మంది ఆమెను కారులో కిడ్నాప్ చేశారు. మహిళను ఓ ఇంటిలోకి ఎత్తుకుని వెళ్లి ఆమె మీద సామూహిక అత్యచారం చేశారు. మహిళను రెండు రోజుల పాటు ఇంటిలో నిర్బందించిన నీచులు ఆమె మీద పదేపదే సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల తరువాత మహిళ ప్రైవేటు పార్ట్ లో ఇనుప రాడ్ చెక్కేసి ఆమెను కారులో పిలుచుకుని వెళ్లి రోడ్డు పక్కన తోసేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. మహిళ ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ చొచ్చుకుపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పోలీసు ఎస్పీ అంటున్నారు.
Manager: గూగుల్ కంపెనీ మేనేజర్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్, కలికాలం !
40 ఏళ్ల వివాహిత మహిళ
ఢిల్లీలో 40 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త, పిల్లలతో కలసి నివాసం ఉంటున్నది. పనిమీద వెళ్లిన మహిళ రాత్రి గాజియాబాద్ నుంచి ఆమె ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో బస్సు కోసం ఆమె వేచి చూస్తోంది. ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో ఆమె అక్కడే ఉందని తెలిసింది.
కారులో కిడ్నాప్ చేసి ?
మహిళ ఆటో కోసం నడుచుకుంటు వెలుతోంది. ఆ సందర్బంలో ఐదు మంది నిందితులు కారులో వెళ్లి మహిళను బలవంతంగా కారులోకి లాక్కొని కిడ్నాప్ చేశారు. మహిళను గాజియాబాద్ సమీపంలోని ఓ ఇంటిలోకి ఎత్తుకుని వెళ్లి కట్టేశారు. తరువాత వివాహిత మహిళ మీద ఐదు మంది సామూహిక అత్యచారం చేశారు.
ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ చెక్కేసి ?
వివాహిత మహిళను రెండు రోజుల పాటు అదే ఇంటిలో నిర్బందించిన నీచులు ఆమె మీద పదేపదే సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల పాటు మహిళకు భోజనం కూడా పెట్టకుండా ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి కసి తీర్చుకున్నారు. తరువాత మహిళ ప్రైవేటు పార్ట్ లో ఇనుప రాడ్ చెక్కేసి ఆమెను కారులో పిలుచుకుని వెళ్లి హైవే రోడ్డు పక్కన తోసేసి వెళ్లిపోవడం కలకలం రేపింది.
ఆస్తి వివాదంతో ఇంత జరిగింది
రోడ్డు పక్కన రక్తపుమడుగులో పడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని గాజియాబాద్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ మీడియాకు చెప్పారు. వివాహిత మహిళకు, నిందితులకు ఆస్తి వివాదంలో చాలాకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయని, ఈ వివాదం కోర్టులో విచారణలో ఉందని గాజియాబాద్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ అన్నారు.
నోటీసులు ఇచ్చిన మహిళా కమీషన్
సామూహిక అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ చెక్కి శాడిస్టుల్లా ప్రవర్తించారని, వారిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని గాజియాబాద్ పోలీసులకు నోటీసులు ఇచ్చామని ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాళివాలే ట్విట్ చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను ఇప్పటికే అరెస్టు చేశామని, నిందితులను విచారణ చేస్తున్నామని గాజియాబాద్ జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ మీడియాకు చెప్పారు.