ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 5వేల ఐడియాలు..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఎంతగా పట్టి పీడిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అసలే కాలుష్య నగరం.. దానికి దీపావళి కాలుష్యం తోడవడంతో వాతావరణంలో కాలుష్య స్థాయి గణనీయంగా పెరిగిపోయింది. గత 17ఏళ్లలో గరిష్ట స్థాయి కాలుష్యాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పుడు అనుభవించక తప్పట్లేదు.

కాలుష్యం బారిన పడ్డ ప్రజలంతా అనారోగ్యం పాలయ్యే అవకాశమున్నా.. ఎలాంటి నివారణ చర్యలను అనుసరించాలనే దానిపై స్పష్టత లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టూరిజం మినిస్టర్ కపిల్ మిశ్రా ఆన్ లైన్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అనూహ్యంగా గంట వ్యవధిలోనే దాదాపు 5వేల సలహాలు, సూచనలు అందాయట.
కాలుష్య సంక్షోభాన్ని అధిగమించేందుకు గాను ప్రతీ ఢిల్లీ వాసి ఒక 2నిముషాలు సమయం కేటాయించి సలహాలు ఇవ్వాల్సిందిగా మిశ్రా కోరారు. దీంతో పెద్ద ఎత్తున సలహాలు సూచనలు వచ్చి చేరాయి. మరి వీటిల్లో ప్రభుత్వ ఆచరణకు పనికి వచ్చేవెన్నో.. పనికిరానివెన్నో..! దేన్ని ఆచరణలో పెట్టి కాలుష్య నియంత్రణ చేస్తారో వేచి చూడాలి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications