ఢిల్లీలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు .. జీవితఖైదు పడిన హత్యాకేసు నేరస్థుడు
12ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలికను దారుణంగా లైంగిక వేధింపులకు గురిచేసిన ఒక వ్యక్తి 2006లో ఢిల్లీలోని సుల్తాన్ పురి లో ఇరవై తొమ్మిదేళ్ళ ఒక మహిళను హత్య చేసిన నేరస్తుడు. ప్రస్తుతం కేసులో నిందితుడిగా ఉన్న క్రిషన్ కుమార్ అనే వ్యక్తికి 2006లో హత్య నేరంపై జీవిత ఖైదు విధించబడింది కానీ సత్ప్రవర్తన కారణంగా 2014లో ఆయనను జైలునుండి విడుదల చేశారు.
ప్రస్తుతం కేసులో 12 ఏళ్ల బాలిక ప్రతిఘటించిన ప్పటికీ 33 ఏళ్ల సదరు నిందితుడు ఆమెపై దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మంగోల్ పురి నివాసి అయిన నిందితుడు చిన్నప్పట్నుంచి చదువు మానేసి, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసై, దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేసే క్రమంలో హత్యకు పాల్పడ్డాడు. ఆ హత్య కేసులోనే అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. తీహార్ జైల్లో ఉన్న ఈ నేరస్తుడిని ఎనిమిది సంవత్సరాల తర్వాత సత్ప్రవర్తన ఖైదీగా పరిగణించి విడుదల చేశారు. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. 2016లో దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తన బంధువు హత్యాయత్నం కేసులో కూడా తనను అరెస్టు చేశారు. ప్రస్తుతం 12 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు.

బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో గమనించిన నలుగురు కామాంధులు బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడి, ఆపై కత్తులతో పొడిచారు. బాలిక చనిపోయిందని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బాలిక గాయాలతో బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నామని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications