రాంగ్ రూట్ లో వెళ్తే FIR నమోదు.. 6 నెలలు జైలు, 1000 ఫైన్..!
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అతివేగం, హెల్మెట్, సీట్ బెల్టు ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ తదితర అంశాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాంగ్ రూట్ లో వెళ్తే FIR నమోదు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోనే తొలిసారిగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్నవారిపై FIR నమోదు చేస్తుంది దిల్లీ ప్రభుత్వం. నూతనంగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం వాహనదారులను జైలుకు తరలించడం, ఫైన్ విధించడం, అలాగే వాహనం సీజ్ చేయడం లాంటి కఠిన చర్యలు చేపడుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపేవారిపై ఉక్కుపాదం మోపడంతోపాటు ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం ఈ చట్టం తీసుకొచ్చినట్లు సమాచారం.
దేశంలోనే తొలిసారిగా రాంగ్ రూట్ లో వెళ్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ నలుగురిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే వాళ్లు బెయిల్ పై విడుదల అయ్యారని.. వాహనదారులకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు వివరిస్తున్నారు.
దిల్లీ రోడ్లపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు దిల్లీలో గణనీయంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 2025 లోనే దాదాపు 3 లక్షలకుపైగా రాంగ్ రూట్ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 1.78 లక్షల చలాన్లు జారీ చేశారు. 1.27 లక్షల కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా దిల్లీ పోలీసులు భావిస్తున్నారు. దీనివల్ల కేవలం వాహనదారుడు మాత్రమే కాకుండా పాదచారులు ఇతర వాహనదారులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

ఇదివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూ రూ. 5 వేలు జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత(BNS) చట్టం, సెక్షన్ 281 ప్రకారం ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు కనీసం 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. అలాగే రూ. 1000 ఫైన్ కట్టాలి. దాంతోపాటు వాహనం కూడా సీజ్ అవుతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications