డెల్టా ప్లస్: కోవిడ్-19లో కొత్త వేరియంట్.. కాక్టెయిల్ చికిత్స దీనిపై పనిచేయట్లేదు - Newsreel
''కరోనావైరస్ సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ (బి 1.617.2) ప్రధాన పాత్ర పోషించింది. ఈ వేరియంట్లో మ్యుటేషన్లు జరగడంతో కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ (బి.1.617.2.1 - ఏవై 1) ఇక్కడ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం’’ అని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు.
''మార్చి నుంచే ఈ వేరియంట్ ఐరోపాలో విజృంభిస్తోంది. ఇక్కడ జూన్ 13న ఈ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం. కాక్టెయిల్ యాంటీబాడీల చికిత్సలు కూడా ఈ కొత్త వేరియంట్పై పనిచేయడం లేదు’’ అని ఆయన చెప్పారు.
https://twitter.com/ANI/status/1404764007530074112
కరోనా రోగులకు కాక్టెయిల్ ఔషధాన్ని వినియోగించేందుకు ఇటీవల భారత ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఈ యాంటీబాడీ ఔషధం ఒక డోసుకు రూ.59,750గా ధర నిర్ణయించారు.
''ఈ వేరియంట్ వ్యాప్తిపై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని కేసులు ప్రస్తుతానికి తక్కువే ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మేం అధ్యయనం చేపడుతున్నాం’’ అని వీకే పాల్ చెప్పారు.
మరోవైపు డెల్టా వేరియంట్పై మిగతా వ్యాక్సీన్ల కంటే స్పుత్నిక్ వి మెరుగ్గా పనిచేస్తోందని రష్యాకు చెందిన ద గమలేయ సెంటర్ ఫర్ స్టడీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
https://twitter.com/ANI/status/1404758879913734147
ఏప్రిల్, మే నెలల్లో భారత్లో కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు రోజుకు నాలుగు లక్షలకుపైనే కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- సంచయిత, అశోక్ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- 'వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ ఇల్లు అమ్మేస్తాం’ అని ఒక కులం వాళ్లు ఎందుకు పోస్టర్లు అంటించారు?
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. 'ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)