నోట్ల రద్దు: కరెన్సీతో చెల్లిస్తే.. కేంద్రం తదుపరి షాకింగ్ నిర్ణయం!!
నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అంతే చేసేందుకు, నగదు రహిత లావాదేవీల పెంచేందుకు కేంద్రం రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని మోడీ నవంబర్ 8వ తేదీన రాత్రిన నోట్ల రద్దును ప్రకటించారు. అప్పటి నుంచి నోట్ల రద్దు చర్చకు దారి తీసింది.
నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం త్వరలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం ఓ ప్యానెల్ను నియమించిన విషయం తెలిసిందే.
నగదు చెల్లింపు లావాదేవీలను తగ్గించే చర్యలకు దిగాలని ఈ ప్యానెల్ సూచించిందని తెలుస్తోంది. దీంతో నగదు చెల్లింపులను తగ్గించేందుకు ఎవరైతే డబ్బు ద్వారా చెల్లింపులు చేస్తారో వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సమాయత్తమవనుందని తెలుస్తోంది.

దీంతో సాధారణంగా ఇప్పటి వరకు ఏటీఎంలు, క్రెడిట్ కార్డుల ద్వారా స్వైపింగ్ చేసినప్పుడు వసూలు చేసే కనీస ఛార్జీలు త్వరలో, కార్డులకు కాకుండా ఎవరైతే డబ్బు ద్వారా చెల్లిస్తారో వారి నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది.
ఈ పేమెంట్లను రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్రం ఈ చర్యను చేపట్టవచ్చునని, పెద్ద నోట్ల రద్దు అంశం తర్వాత త్వరలో కేంద్రం తీసుకురానున్న మరో మార్పు ఇదేనని ప్రచారం సాగుతోంది.
ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వతల్ పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు తగ్గించేందుకు ఈ సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 12 శాతం ఉన్న వాటాను 30 నుంచి 90 రోజుల మధ్య తగ్గించాలనుకుంటున్నారు.
-
UPI:మహిళలే టాప్. గ్రామాల్లో డిజిటల్ విప్లవం! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..!












Click it and Unblock the Notifications