'నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు, అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం వచ్చిన ఇబ్బందులను, కష్టాలను ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు శుక్రవారం అన్నారు.
నల్గొండ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం వచ్చిన ఇబ్బందులను, కష్టాలను ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు శుక్రవారం అన్నారు. రెండు నెలల్లో కరెన్సీ కష్టాలు తీరుతాయని చెప్పారు.
నోట్ల రద్దు వల్ల నల్ల ధనంతో పాటు నకిలీ నోట్లు చెలామణిలో లేకుండా పోయాయని చెప్పారు. బంగారం, భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.

నల్ల ధనం పైన డిసెంబర్ 16వ తేదీ తర్వాత తాము ప్రజలలోకి వెళ్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక నల్లధనం కలిగిన దేశం మనదేనని చెప్పారు. నల్ల ధనానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మండపడ్డారు.
క్యాష్ లెస్ పైన ప్రచారం ప్రారంభం
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ప్రజలను క్యాష్ లెస్ విధానానికి మళ్లించేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా) చొరవ చూపుతోంది.
ఇందుకోసం ప్రచార కార్యక్రమం-డిజిథాన్ను అసోసియేషన్ చేపట్టింది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర రావు గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీల పైన అవగాహన కల్పిస్తారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications