షాక్: సీటివ్వలేదని రైల్లో ప్రయాణీకులపై కారం చల్లాడు, ఎక్కడంటే?
తనకు సీటివ్వలేదనే నెపంతో ఓ వ్యక్తి ప్రయాణీకులపై కారం చల్లాడు. దీంతో ఏడుగురు ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ ఘటన ముంబాయిలోని లోకల్ ట్రైన్ లో చోటుచేసుకొంది.
ముంబై: తనకు సీటివ్వలేదనే నెపంతో ఓ వ్యక్తి ప్రయాణీకులపై కారం చల్లాడు. దీంతో ఏడుగురు ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ ఘటన ముంబాయిలోని లోకల్ ట్రైన్ లో చోటుచేసుకొంది.
మంగళవారంనాడు షాహద్ రైల్వేస్టేషన్ నుండి సీఎస్ టీ నుండి బయలుదేరిన రైల్లో ఓ వ్యక్తి తనకు కూడ సీటు కావాలంటూ తోటి ప్రయాణీకులతో గొడవకు దిగాడు.

అయితే వారు అంగీకరించలేదు.దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకొన్న కారాన్ని ప్రయాణీకులపై చల్లాడు. దీంతో రైల్లో ప్రయాణీస్తున్న ఏడుగురు ప్రయాణీకులు అస్వస్థతకు గురయ్యారు.
కళ్ళు, శరీరంపై మంటలు రావడంతో బాధితులు కళ్యాణ్ వద్ద రైలును దింపి ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించారు. అయితే ఈ ఘటనపై ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీటీవి పుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకొన్నారు. గతంలో సీటు కోసం వాళ్ళు తనపై దౌర్జన్యానికి దిగారనీ, అందుకు ప్రతీకారంగానే తాను వారిపై కారం చల్లినట్టు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. సీటు కోసం రైళ్ళలో గొడవలు జరగడం మామూలే. అయితే ఏకంగా కారం చల్లడం మాత్రం తొలిసారి జరిగిందని అధికారులు అంటున్నారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications