వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్ మనీ వెల్లడించేందుకు మరో అవకాశం, హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ నల్లధనం వెల్లడికి మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నుంచి స్వచ్ఛంద వెల్లడికి నిర్దేశించిన బ్లాక్ మనీ విండోను ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా నల్లధనం వివరాలను వెల్లడించిన వారికి ఐటీ శాఖ నుంచి ఉపశమనం లభిస్తుంది.

జూన్ 1 నుంచి నాలుగు నెలలపాటు అంటే సెప్టెంబర్ 30 వరకు అక్రమ సొమ్ముపై 45 శాతం పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సొమ్ముపై ఎలాంటి జరిమానాను గాను, విచారణను గాను ఎదుర్కొవాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఇన్‌కం డిక్లరేషన్ స్కీమ్ 2016 ప్రకారం సెప్టెంబర్ 30లోగా నల్లధనాన్ని బహిరంగంగా ప్రకటించకపోతే ఆ తర్వాత పన్నులు, సర్‌చార్జీ, జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టప్రకారం ఆదాయం బహిర్గతం చేసిన వారిపై ఎలాంటి చర్యలు, ముఖ్యంగా విచారణ గానీ స్క్రూట్నీ చేయరాదు.

Dhan wapsi from June 1: Govt begins 4 month amnesty for black money

దేశీయంగా పన్ను ఎగనామం పెడుతున్న వారిని దృష్ట్యా ఆర్థిక మంత్రి జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్‌లో ఈ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో అక్రమంగా దాచి పెట్టిన ఆస్తులను వెల్లడించడానికి ఇలాంటి స్కీంను ప్రవేశపెట్టింది.

బహిర్గతం కాని పలు ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు, ఇతర మార్గాల్లో ఇన్వెస్టులకు ఈ స్కీమ్ వర్తించనున్నది. ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుందని, లేదంటే జరిమానాతోపాటు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

English summary
The Income Declaration Scheme, 2016, which provides an opportunity to all persons who have not declared income correctly in earlier years to come clean will open on June One.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X