Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రంలో రెండో రాజధాని: సీఎం అనూహ్య నిర్ణయం..

70లక్షల అతి తక్కువ జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధాని అవసరమా? అంటే.. దానికి కూడా వీరభద్రసింగ్ సమాధానం చెబతున్నారు.

షిమ్లా: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వాలు కొత్త హామీలను తెరమీదకు తీసుకురావడం షరా మామూలే. అయితే ఆ నిర్ణయాలు నిజంగా ప్రజాభివృద్దికి దోహదం చేయగలిగితే వాటిని శంకించాల్సిన అవసరం లేదు.

తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి రెండో రాజధాని అవసరముందంటున్న ఆయన.. ధర్మశాలను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కు షిమ్లా రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. వీరభద్రసింగ్ తీసుకున్న నిర్ణయం ప్రజలను ఆకర్షించడానికే అన్న వాదన కూడా వినిపిస్తోంది. 70లక్షల అతి తక్కువ జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధాని అవసరమా? అంటే.. దానికి కూడా వీరభద్రసింగ్ సమాధానం చెబతున్నారు.

Dharamsala Declared Second Capital Of Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 25సీట్లు ధర్మశాల పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక్కడి ప్రాంతవాసులకు షిమ్లా దూరంగా ఉండటంతో ముఖ్య పనుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మశాలను రెండో రాజధానిగా చేస్తే.. దానికున్న చారిత్రక నేపథ్యం కూడా పర్యాటకంగా ఉపయోగపడుతుందని వీరభద్రసింగ్ తెలిపారు.

ధర్మశాలలో బౌద్ద గురువు దలైలామా ఆశ్రమం ఉన్న సంగతి తెలిసిందే. ప్రకృతి అనుకూలతతో పాటు అడ్వంచర్ టూరిజానికి కేంద్రంగా ధర్మశాల ఉండటంతో.. రెండో రాజధాని నిర్ణయం రాష్ట్రాభివృద్దికి దోహదం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+