తమిళనాడులో మరో కొత్త పార్టీ, మన్నార్ గుడి ఫ్యామిలీలో చిచ్చు, అపోలోలో సీఎం కావాలని!
చెన్నై: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ తెర మీదకు వచ్చింది. శశికళ మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీలో చిచ్చు రేగడంతో అమ్మ మక్కల్ మన్నేట్ర కళగం పార్టీ వ్యవస్థానకుడు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు పోటీగా అతని మేనమామ, శశికళ సోదరుడు దివాకరన్ అమ్మ మణి అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అమ్మ మరణించిన రోజు అపోలో ఆసుపత్రిలోనే సీఎం కావాలని టీటీవీ దినకరన్ పావులుకదిపాడని దివాకరన్ బాంబు పేల్చాడు.

పదవులు ఇస్తే భయం
ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలో శశికళ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ పదవులు లేవు. శశికళ కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే తనను రాజకీయంగా తొక్కేస్తారని టీటీవీ దినకరన్ ఆందోళన చెందుతున్నాడు.

మాటల యుధ్దం
టీటీవీ దినకరన్ పార్టీలో శశికళ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ పదవులు రాకపోవడంతో మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీలో మాటల యుధ్దం మొదలైయ్యింది. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్ నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.

అమ్మ వర్గం అంటూ ప్రచారం
టీటీవీ దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అతని మేనమామ అమ్మ మణి పార్టీ స్థాపించారు. జయలలిత వర్గం అనే అర్థం వచ్చేలా దివాకరన్ తన కొత్త పార్టీ పేరు అమ్మ మణి అని పెట్టుకున్నాడు. టీటీవీ దినకరన్ వర్గంతో తాము కలిసి పని చెయ్యమని దివాకరన్ తేల్చి చెప్పాడు.

రాష్ట్రంలో కమిటీలు
అమ్మ అణి పార్టీకి తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ పదవులకు నాయకులను నియమిస్తామని మన్నార్ గుడిలో దివాకరన్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా కమిటీలను అతి త్వరలో ప్రకటించి తరువాత సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని దివాకరన్ ప్రకటించారు.

సీఎం కావాలని అపోలోలో స్కెచ్
2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించిన వెంటనే టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని అపోలో ఆసుపత్రిలోనే పావులు కదిపాడని దివాకరన్ ఆరోపించారు. ఆ సమయంలో తాము టీటీవీ దినకరన్ ను అడ్డుకుని పన్నీర్ సెల్వంను సీఎం చేశామని దివాకరన్ అన్నాడు. సీఎం చెయ్యలేదని కోపంతో టీటీవీ దినకరన్ మామీద కక్షకట్టాడని దివాకరన్ ఆరోపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications