హోలీపై దియా మీర్జా వివాదాస్పదం: క్షమాపణలు
ముంబై: హోలీ పండగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి దియా మీర్జా అనంతరం తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. 'నా వ్యాఖ్యలతో మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి.. మనసు చలించిపోయి అలా మాట్లాడాను'అని పేర్కొంది.
కొద్ది రోజుల క్రితం హోలీ పండగపై దియా చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది. దీంతో తన వ్యాఖ్యల వెనుక ఉన్న విషయాన్ని దియా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులకు వివరించారు.
'ఓ పక్క కరవుతో రైతుల ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరేమో హోలీ అంటూ నీటిని వృథా చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. ఇలా అంటున్నందుకు నన్ను హిందూ వ్యతిరేకి అనండి' అంటూ దియా కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు.
అయితే దీనిపై విమర్శలు రావడంతో హోలీ పర్వదినాన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు దియా. తన వ్యాఖ్యలతో ఎవరి నమ్మకాలనైనా కించపరిచినట్లయితే.. క్షమించాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపైనే తాను వ్యాఖ్యానించానని వివరణ ఇచ్చారు.
'నాకు
అన్నిమతాల
మీద
సమాన
గౌరవం
ఉందని,
అయితే
దేశంలో
అనేక
ప్రాంతాల్లో
కరవు
పరిస్థితులు
నెలకొన్నాయని
చెప్పుకొచ్చారు.
నీరు
లేక
పంటలు
పండటం
లేదని,
అందువల్ల
చాలా
మంది
రైతులు
ఆత్మహత్యలు
చేసుకుంటున్నారు'
దియా
మీర్జా
చెప్పుకొచ్చారు.
దియా
వ్యాఖ్యలను
కొందరు
సమర్థించగా,
మరికొందరు
తప్పుబట్టారు.
కాగా, చిన్నతనంలో తానూహోలీ అంటూ చాలా నీటిని వృథా చేశానని, అయితే ఇప్పుడు దాని విలువ తెలుస్తోందని దియా తెలిపారు. మనమంతా నీటి కొరత సమస్యను పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ ఓ పౌరుడిగా దాన్ని అరికట్టేందుకు మనవంతుకృషి చేయాలని కోరారు.
The irony of the times we live in: farmers commit suicide due to drought and people waste water to 'play' #Holi.Go ahead call me anti-Hindu.
— Dia Mirza (@deespeak) March 16, 2016
Let me start by saying to all those who have taken strong offense to my tweet - "The irony of the times we live in:...
Posted by Dia Mirza on Monday, March 21, 2016