దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఏడాది: మృతులకు నివాళి

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఘటనలో అసువుబాసిన మృతులకు నివాళులర్పించిన అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతం, భాషలతో సంబంధం లేదని, దేశంలో అరాచకం సృష్టించడమే వారి లక్ష్యమని ఆయన అన్నారు. ఆయనతోపాటు బిజెపి నగర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని నివాళులర్పించారు.
2013, ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మరో 138 మదిని గాయాలపాలు చేసి, 76 మంది అవయవాలు లేకుండా చేశాయి. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కాగా ఇప్పటికీ కొందరు బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరనే లేదు. ఘటనా స్థలానికి వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులు, ఘటనను తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications