100/117 గెలుస్తామనుకుంటే.. ఇలాంటి ఫలితాలా?, ఊహించలేదు: ఆప్
పంజాబ్ లో వచ్చిన ఫలితాలను పున:సమీక్షించుకుంటామని, ఇలాంటి ఫలితాలను ఊహించలేదని ఆప్ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు.
ఢిల్లీ: అటు పంజాబ్ ఇటు గోవా.. గెలుస్తామన్న ధీమాతో బరిలో దిగిన ఆప్ కు ఈ రెండు రాష్ట్రాల్లోను ఎదురుదెబ్బే తగిలింది. పంజాబ్ లో రెండో స్థానంతో సరిపెట్టుకుంటే గోవాలో ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల్లోను ఆప్ పై కాంగ్రెస్ దే పైచేయి అయింది.
ఈ నేపథ్యంలో ఆప్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తమను నిరాశపరిచాయమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించిన తమకు, వచ్చిన ఫలితాలు నిరాశకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఆప్ ను తక్కువ అంచనా వేయవద్దని ఆయన సూచించారు.

రాష్ట్రంలో కొత్తగా పోటీ చేసిన పార్టీ రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. అదే సమయంలో ఫలితాలను పున:సమీక్షించుకుంటామని, ఇలాంటి ఫలితాలను ఊహించలేదని ఆప్ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు. పంజాబ్ లో 117స్థానాలకు 100స్థానాలు గెలిచి తీరుతామనుకుంటే.. అంచనాలు తారుమారయ్యాయని అన్నారు.
కాగా, పంజాబ్ లో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకోగా.. ఆప్-20, అకాళీదళ్+బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుచుకున్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications