Viral video: శబరిమలలో అద్భుతం జరిగింది..
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. మకరజ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల కొండలు మార్మోగి పోయాయి. పొన్నాంబలమేడు పైనుంచి మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణతో శబరిమల మారుమోగింది.
#MakaraJyothi #Sabarimala
— सौम्या சௌமியா (Modi's family) (@sowmiyasid) January 14, 2026
Makarjyothi at ponambala medu.
Swamiya sarnam ayappa pic.twitter.com/yncexjwLBB
కేరళలోని శబరిమల క్షేత్రంలో అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శబరిమలలోని పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. పవిత్రమైన మకరజ్యోతిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భగవన్నామ స్మరణతో మారుమోగిపోయాయి.

ఏటా సంక్రాంతి సందర్భంలో శబరిమలలో మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. మకరజ్యోతి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మకరజ్యోతి దర్శనం కోసం సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అంచనా ఉంది. ఈ మకర జ్యోతి దర్శనంతో మండల- మకరవిళక్కు తీర్థయాత్రలో ప్రధాన ఘట్టం ముగిసింది.












Click it and Unblock the Notifications