మీరు అధికారంలో ఏం చేశారో నాకు తెలుసు, బయట పెట్టమంటారా?, డీకే సవాల్!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఇప్పుడు అదే అస్త్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయోగిస్తూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk sivakumar) బీజేపీ నేతల ఆరోపణలపై బాంబు పేల్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ల (congress) మధ్య చిచ్చు రాజుకుంది. ఇంతలో ఇతర ఆరోపణలు కూడా తెరమీదకు (bjp)వచ్చాయి. పాత హుబ్బళి అల్లర్ల కేసు ఉపసంహరణ లేఖ విషయమై డీసీఎం శివకుమార్ మాట్లాడుతూ బీజేపీ నేతలకు చేయాల్సిన పని ఇప్పుడు ఏమీ లేదని ఎద్దేవ చేశారు. బీజేపీ (bjp) అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో ప్రజలకు తెలియదా, ప్రజలకు అన్ని తెలుసని డీకే శివకుమార్ (dk sivakumar) మండిపడ్డారు.

బీజేపీ నేతలను ఎక్కడ పెట్టాలో అక్కడే ప్రజలు నిలబెట్టారని, ఇంతకాలం అయినా శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేకపోతున్నారని (dk sivakumar) బీజేపీ మీద డీకే శివకుమార్ విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో చాలా కేసులు ఉపసంహరించుకున్నట్లు వారు నాకు చెప్పరు. హింసాత్మక కేసులు (shimoga) కూడా ఉపసంహరించబడ్డాయి.
2019లో మొత్తం 385 క్రిమినల్ కేసులు ఉపసంహరించబడ్డాయి. ఇలాంటి సంఘటనలు వెయ్యికి పైగా ఉన్నాయి. బీజేపీ (bjp) హయాంలో 7, 361 మంది రౌడీ షీటర్లను వదిలేశారని డీకే శివకుమార్ (dk sivakumar) ఆరోపించారు. ఇదే సందర్బంలో (shimoga) కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీసీఎం డీకే శివకుమార్ బీజేపీ నాయకుల పేరు పేరు చెప్పి వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బసవరాజ్ బోమ్మయ్, అరగ జ్ఞానేంద్ర, మధుస్వామి, అంగర, అరుణ్ కుమార్, జి పాటిల్, భూపయ్య, దొడ్న గౌడార్ మరియు వీరన్న చరంతిమఠ్, ఎస్.ఆర్. విశ్వనాథ్, బి.ఎస్. పాటిల్, సుభాస్ గహితేదార్తో (shimoga)పాటు రాజ్కుమార్ పాటిల్, రవీంద్రనాథ్ మోడల్ విరూపాక్షప్ప, ఆనంద్ మామణి, అరవింద బెల్లాడ్, సవదత్తి పాటిల్, ఎస్కె బెల్లుబ్బి, ఎన్ రవికుమార్ అందరూ తమకు కావలసిన వారి మీద కేసులు ఎత్తేయాలని ప్రభుత్వానికి లేఖలు రాశరని డీకే శివకుమార్ (dk sivakumar) ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని, త్వరలోనే తాను వాటిని బయటపెడతానని డీకే శివకుమార్ (dk sivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (bjp)నేతలు తొందరపడుతున్నారు, మీరు మ్మల్ని వేలు ఎత్తి చూపిస్తున్నారని, మీ గురించి మాకు తెలియదని అనుకుంటున్నారని, మీరు లేఖలు రాసి సంతకం చేసిన ఉత్తరాలన్నీ తీసుకొచ్చి బయటపెట్టమంటారా? అని డీసీఎం డీకే శివకుమార్ (dk sivakumar) బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. మొత్తం మీద శివమొగ్గలో జరిగి అల్లర్ల విషయంలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications