రాజకీయం చెయ్యాలంటే ఎలాగైనా చేస్తాము, మీకు ఆసక్తి ఉంటే చర్చలకు రండి, నీటి కోసం!
బెంగళూరు/చెన్నై: కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల పంపిణీ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. కావేరీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా తమిళనాడుకు నీటి విడుదల చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటకలో అప్పుడు నీళ్లు ఉన్నాయని, అందుకే నీటిని విడుదల చేశామని డీకే శివకుమార్ అన్నారు.
తమిళనాడు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ చేసిన ప్రకటనపై ప్రశ్నించగా ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు ఉందని, ఈ విషయంపై తాము ఎక్కువగా మాట్లాడమని, కావేరీ నీళ్లు లేవని మేము సుప్రీం కోర్టుకు చెబుతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం మేకదాటు డ్యామ్ అని, కావేరి నీటి విడుదల కారణంగా కర్ణాటక కంటే తమిళనాడుకు ఎక్కువ మేలు జరుగుతుందని, కర్ణాటక వాడుకోలేని నీరు తమిళనాడుకు వెలుతోందని, ఆపద సమయంలో కావేరి నీటిని వినియోగించుకునేందుకు మేకదాటు డ్యామ్ అవసరమని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు.
ఈ మేకదాటు ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. కావున ఈ విషయంలో ఉదారత, సహకారం అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడులోని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని డీకే శివకుమార్ అన్నారు. కావేరి సమస్యను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన ప్రకటనపై మీడియా ప్రశ్నించగా డీకే శివకుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఈ అంశంపై కర్ణాటక రాష్ట్రంపై వారికి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా మాతో చేర్చలు జరిపి రాష్ట్రానికి అనుకూలంగా తమ గళాన్ని వినిపించాలి. వారు చేయకుంటే మా కర్తవ్యం మేం చేస్తాం, అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాం. బీజేపీ నాయకులు రాలేకపోయారు. ప్రధాని, కేంద్ర జలవిద్యుత్ శాఖ మంత్రి తమకు సమయం ఇస్తే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పిలుచుకుని అక్కడికి వెళ్లి మా వాదనను వినిపిస్తామని డీకే శివకుమార్ తెలిపారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానాన్ని కూడా గౌరవించాలి. కావేరి నదీ జలాలపై ఇప్పటికే మా బృందం ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించిందని, మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశం కాబోతున్నామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం సిద్దరామయ్య ప్రభుత్వం కావాలనే కావేరి నీరును తమిళనాడుకు వదిలేసిందని, కర్ణాటక రైతులకు ద్రోహం చేసిందని ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications