మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
ఐటీ అధికారులు కాంగ్రెస్ నేతలను మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేస్తూ కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన డబ్బు, డీకే శివకుమార్ ఇస్తున్న డబ్బు మీ దగ్గర ఉందని చెప్పాలని డబ్బులు ఉన్న వారిని బెదిరిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. ఐటీ శాఖ అధికారులు బీజేపీ ఏజెంట్లుగా పని చేస్తున్నారని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను రోజంతా కూర్చోబెట్టి ఎన్నికల ప్రచారం చెయ్యకుండా ఐటీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ శాఖ అధికారులు ఇంత వరకు ఏ బీజేపీ నాయకుడి ఇంటికైనా వెళ్లారా? బీజేపీ డబ్బులు పంచుతున్న సంగతి ఐటీ శాఖ అధికారులకు తెలియదా?, అయినా ఐటీ శాఖ అధికారులు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

బెంగుళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతున్నాయని డీకే శివకుమార్ ఆరోపించారు. దేశమంతటా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, అయితే కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాత్రమే ఎందుకు ఐటీ అధికారులు దాడి చేస్తున్నారని డీకే శివకుమార్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరని కోరికల ప్రకటనలు చేస్తున్నారని, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి పునాది లేదని డీకే శివకుమార్ ఆరోపించారు.
చివరికి బీజేపీ నాయకులు ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం లేదని, కర్ణాటకలో కూడా బీజేపీకి రెండంకెల స్థానం దక్కదని, అందుకే నిరాశతో మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక రూ.2, 800 ఉన్న గ్రాము బంగారం ఇప్పుడు రూ.7, 500కి చేరిందని, మన మహిళలు మంగళసూత్రం ధరించకుండా ఉండేందుకు బీజేపీ ధరలు పెంచిందని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో మా పార్టీకి ఒక సూచన ఇస్తున్నాను. మన దేశాన్ని, మతాన్ని కాపాడుకోవాలి. బెంగళూరులో మా అమ్మ దేశం కోసం తన మాంగల్యసూత్రాన్ని త్యాగం చేసిందని ప్రియాంక గాంధీ బాధాకరమన్నారు. ఈ విషయాన్ని మోదీ గ్రహించాలి. మేము ప్రధాని మోదీ స్థానాన్ని గౌరవిస్తాము. ప్రజలు పదేళ్లు అనుమతించారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, దేశాన్ని, మహిళలను ఇలా అవమానించకూడదని డీకే శివకుమార్ బీజేపీ నాయకులపై మండిపడ్డారు.
-
PM Modi: మోడీకి నెతన్యాహు పర్సనల్ థ్యాంక్స్..! అందుకే..! -
PM Modi: ఇరాన్ వార్ పై ఏం చేద్దాం?-ప్రధాని మోడీ అత్యున్నత భేటీ..! -
వాళ్ళను ఇరాన్ పంపించండి.. ప్రధాని మోదీకి యాంకర్ రష్మి షాకింగ్ రిక్వెస్ట్! -
దుబాయ్లో చిక్కుకున్న బాలయ్య హీరోయిన్: రక్షించమంటూ ప్రధాని మోదీకి మొర! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..! -
సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక.. -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!!












Click it and Unblock the Notifications