Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?

ఐటీ అధికారులు కాంగ్రెస్ నేతలను మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేస్తూ కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన డబ్బు, డీకే శివకుమార్ ఇస్తున్న డబ్బు మీ దగ్గర ఉందని చెప్పాలని డబ్బులు ఉన్న వారిని బెదిరిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. ఐటీ శాఖ అధికారులు బీజేపీ ఏజెంట్లుగా పని చేస్తున్నారని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను రోజంతా కూర్చోబెట్టి ఎన్నికల ప్రచారం చెయ్యకుండా ఐటీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ శాఖ అధికారులు ఇంత వరకు ఏ బీజేపీ నాయకుడి ఇంటికైనా వెళ్లారా? బీజేపీ డబ్బులు పంచుతున్న సంగతి ఐటీ శాఖ అధికారులకు తెలియదా?, అయినా ఐటీ శాఖ అధికారులు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారా అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.

DK Sivakumar accused that the price of gold in India has gone up because of Prime Minister Modi

బెంగుళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతున్నాయని డీకే శివకుమార్ ఆరోపించారు. దేశమంతటా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, అయితే కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాత్రమే ఎందుకు ఐటీ అధికారులు దాడి చేస్తున్నారని డీకే శివకుమార్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరని కోరికల ప్రకటనలు చేస్తున్నారని, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి పునాది లేదని డీకే శివకుమార్ ఆరోపించారు.

చివరికి బీజేపీ నాయకులు ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం లేదని, కర్ణాటకలో కూడా బీజేపీకి రెండంకెల స్థానం దక్కదని, అందుకే నిరాశతో మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక రూ.2, 800 ఉన్న గ్రాము బంగారం ఇప్పుడు రూ.7, 500కి చేరిందని, మన మహిళలు మంగళసూత్రం ధరించకుండా ఉండేందుకు బీజేపీ ధరలు పెంచిందని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో మా పార్టీకి ఒక సూచన ఇస్తున్నాను. మన దేశాన్ని, మతాన్ని కాపాడుకోవాలి. బెంగళూరులో మా అమ్మ దేశం కోసం తన మాంగల్యసూత్రాన్ని త్యాగం చేసిందని ప్రియాంక గాంధీ బాధాకరమన్నారు. ఈ విషయాన్ని మోదీ గ్రహించాలి. మేము ప్రధాని మోదీ స్థానాన్ని గౌరవిస్తాము. ప్రజలు పదేళ్లు అనుమతించారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, దేశాన్ని, మహిళలను ఇలా అవమానించకూడదని డీకే శివకుమార్ బీజేపీ నాయకులపై మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+