మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, మాజీ సీఎం మాస్ వార్నింగ్, నా గురించి తెలుసు కదా !
మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, నేను ఇప్పటికీ ఆయనకు గౌరవం ఇస్తున్నానని, ఆ గౌరవం ఇస్తూనే ఉంటానని, వారు నాకు ఎంత గౌరవం ఇస్తే నేనూ అంతే గౌరవం ఇస్తానని, తేడా వస్తే పద్దతి వేరుగా ఉంటుందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ మాజీ సీఎం కుమారస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుమారస్వామి అంటే నాకు గౌరవం ఉన్నా ఆయన నా వ్యక్తిగత విషయంలో పదే పదే నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. తాను బండలు పగలగొట్టానని, విషం పెట్టానని, ఆడపిల్లల చేతుల్లోంచి భూములు లాక్కున్నానని ఆరోపణలు చేశారని డీకే శివకుమార్ అన్నారు. నేను బండరాళ్లను పగలగొట్టానని, నేను చట్టబద్ధంగా నా పొలంలో బండరాయిని పగలగొట్టానని, ఎవరి భూమిలో నేను రాళ్లు పగలగొట్టలేదని (క్వారీలు) డీకే శివకుమార్ అన్నారు.

పెద్దల పట్ల గౌరవం ఉంటే వారిని గౌరవించాలని డీకే శివకుమార్ అన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఎన్నికల తర్వాత కుమారస్వామి జేడీఎస్ పార్టీ ఎక్కడికి చేరుకుంటుందో వేచి చూడాలని డీకే శివకుమార్ ఎద్దేవ చేశారు. మాసమాజాన్ని (ఒక్కలిగ కులం) కోసం ఆయన్ను గౌరవించాను, తన గురించి ఏం మాట్లాడినా సహించానని, ఆయన సవాల్ని స్వీకరిస్తున్నానని, లోక్ సభ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అని డీకే శివకుమార్ అన్నారు.
ఎన్ఓసీలు ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ వాసులను బెదిరిస్తున్నారన్న మాజీ సీఎం కుమారస్వామి మీ మీద ఆరోపణ చేశారు కాదా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరులో నీటి ఎద్దడి సమయంలోనూ బెంగళూరు ప్రజలందరికీ తాగునీరు సరఫరా చేస్తున్నాం. కుమారస్వామి తన మాటలను దాచిపెట్టి ప్రజల దృష్టి మరల్చేందుకే తన మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డీసీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు.

బీజేపీ నేతలు మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. తమ మీద ఇలా మాట్లాడమని మాజీ సీఎం కుమారస్వామికి ఎవరు చెప్పారు? నేను ఆ విషయాన్ని వదిలేస్తాను. కానీ ఆయన స్త్రీలను అవమానించడం సరికాదని, ఆ మాటలను ఆయన మనసులో నుండి తొలగించలేమని డీకే శివకుమార్ అన్నారు. ఇది బెంగళూరు రూరల్ లోక్సభ నియోజక వర్గం ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు.
కుమారస్వామి వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళల అందరి సమస్య అని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ సీఎం కుమారస్వామిపై డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. మాజీ సీఎం కుమారస్వామి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని, కనీసం మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఆర్ అశోక్ ఎందుకు మాట్లాడటం లేదు? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications