ఆ జిల్లా పేరు మార్చేస్తున్నారు. త్వరలో బెంగళూరు దక్షిణ జిల్లా ?, బెంగళూరులో కొత్త మొలకలు !
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయంగా బలపడటానికి ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. బెంగళూరు నగర శివార్లలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు దక్షిణ జిల్లాగా మార్చడంపై జిల్లా వాసుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామనగర జిల్లా పేరు మార్చాలన్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని, అందులో ఎలాంటి అనుమానం లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. నా వ్యక్తిగత హోదాలో సర్వే చేయిస్తున్నానని, ఇప్పటి వరకు సర్వేకు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

సర్వే నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించనున్నామని, తరువాత మంత్రివర్గం ఆమోదం పొందిన అనంతరం రామనగర జల్లా పేరును బెంగళూరు దక్షిణ జిల్లాగా మారుస్తామని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరు దక్షిణ జిల్లాకు రామనగర కేంద్రంగా ఉంటుందని. ప్రస్తుతం ఉన్న రామనగర, చెన్నపట్టణ, కనకపుర, మాగడి తాలూకాలు బెంగళూరు దక్షిణ జిల్లాలో భాగంగా కొనసాగుతాయని డీకే శివకుమార్ చెప్పారు.
బెంగళూరు దక్షిణ జిల్లాలో కొత్త ప్రాంతాలను చేర్చే ప్రతిపాదన లేదని, రామనగర జిల్లా పేరు మార్చిన తర్వాత, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రామనగర, చెన్నపట్టణ, కనకపుర, మాగడి తాలూకాలను బెంగళూరు ఉప పట్టణాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, నమ్మ మెట్రో రైలును ఈ నాలుగు తాలూకాలకు పొడిగించేందుకు సర్వే నిర్వహిస్తామని డీకే శివకుమార్ తెలిపారు.

రామనగర జిల్లా పేరు మార్చడం ప్రధాన లక్ష్యం మాగాడి, కనకపుర తాలూకాలకు పరిశ్రమలను ఆకర్షించడం జరుగుతోందని, ఈ ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పలువురు పారిశ్రామికవేత్తలను అభ్యర్థించామని డీకే శివకుమార్ వివరించారు. ఈ ప్రాంతాలకు బెంగళూరు దక్షిణ జిల్లాగా నామకరణం చేస్తే బెంగళూరు అనే పదానికి దాని స్వంత బ్రాండ్ విలువ ఉంటుందని డీకే శివకుమార్ అన్నారు\
పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మేము రామనగర జిల్లాకు బెంగళూరు దక్షిణ జిల్లాగా నామకరం చేస్తున్నామని డీకే శివకుమార్ అన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ రామనగర జిల్లాకు 'బెంగళూరు సౌత్ జిల్లా'గా పేరు మార్చే ప్రభుత్వ ప్రతిపాదనను ప్రకటించారు. ఈ భాగం అభివృద్ధిని ప్రోత్సహించడానికి బెంగళూరు బ్రాండ్ పేరుపై పని చేయడం ప్రారంభించామని డీకే శివకుమార్ అన్నారు.
ఈ ప్రతిపాదనను రామనగర వాసులు వ్యతిరేకించగా, కనకపుర వాసులు తమకు ప్రత్యేక జిల్లా కావాలని డిమాండ్ చేశారు. 2007లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి రామనగర జిల్లాను బెంగళూరు సౌత్గా మారుస్తే నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. తరువాత రామనగర జిల్లా పేరు మార్చే ప్రతిపాదన మూలనపడింది. ఇప్పుడు రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చాలన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయన ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications