భారత్ కు తీపి కబురు అందించిన డొనాల్డ్ ట్రంప్
భారత్ కు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీపికబురు వినిపించారు. భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించిన 25 శాతం అదనపు టారిఫ్ ను రద్దు చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. రష్యా నుండి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోండటం పట్ల అదనంగా విధించిన టారిఫ్ అది. ఈ ఒక్క సంతకంతో.. 25 శాతం అదనపు భారం భారత దిగుమతులపై తగ్గినట్టయింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి రానుంది. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది.
దీంతో పాటు దాదాపు ఏడాదికాలంగా భారత్- అమెరికా మధ్య నానుతూ వస్తోన్న వాణిజ్య ఒప్పందాల కథ కూడా సుఖాంతమైంది. ఈ ఉద్రిక్తతలకు కూడా తెరదించారు డొనాల్డ్ ట్రంప్. భారత్- అమెరికా మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటూ వచ్చిన ట్రేడ్ అగ్రిమెంట్స్ కొద్ది రోజుల క్రితమే ఖరారు అయ్యాయి. ఈ కీలక నిర్ణయం- ఇరు దేశాల సంబంధాలలో కొత్త మలుపు తీసుకుంది.

రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందిస్తోందంటూ గతంలో ట్రంప్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కొనుగోళ్లు ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యలకు పరోక్షంగా మద్దతునిస్తున్నాయని ఆయన వాదించారు. అప్పట్లో యూరప్, అమెరికా కూడా రష్యా చమురును కొనుగోలు చేశాయి. దీనికి ప్రతిగా భారతీయ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించారాయన. ఇది ఆ దేశ మార్కెట్లో భారతీయ వస్తువుల ఖర్చును గణనీయంగా పెంచింది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్ ముడి చమురు కొనుగోళ్లపై విభేదాలతో దెబ్బతిన్న ఆర్థిక సంబంధాలను ఇది పునరుద్ధరిస్తూ, భారతీయ ఎగుమతిదారులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా భారత వస్తువులపై పరస్పర సుంకాలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. అమలు తేదీ ఇంకా ఖరారు కాలేదు. దీనిపై వైట్ హౌస్ ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేసింది కూడా. రాబోయే అయిదేళ్లలో 500 బిలియన్ డాలర్ల అమెరికన్ ఇంధనం, విమానాలు, విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కుకింగ్ కోల్ను కొనుగోలు చేయనుంది.












Click it and Unblock the Notifications