Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్ న్యూస్.. డోన్ట్ మిస్: దరఖాస్తులను ఆహ్వానిస్తోన్న రిలయన్స్

రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యాసంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 7 చివరి తేదీ. మెరిట్-కమ్-మీన్స్ ప్రాతిపదికన ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయం అందిస్తుంది.

దరఖాస్తుదారులు 2025-26 విద్యాసంవత్సరంలో ఏదైనా సబ్జెక్ట్ స్ట్రీమ్‌లో పూర్తికాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశించిన మొదటి సంవత్సరం విద్యార్థులు అయి ఉండాలి. 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ స్కాలర్‌షిప్ డిగ్రీ కాల వ్యవధికి రెండు లక్షల వరకు అందిస్తుంది.

Don t Miss Out Reliance Foundation Scholarships for UG and PG Students Now Open

దరఖాస్తు ప్రక్రియ:

వ్యక్తిగత, విద్యా, సాధించిన వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యా సంబంధిత రికార్డులతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. నిర్బంధ ఆప్టిట్యూడ్ పరీక్ష (వెర్బల్, అనలిటికల్, లాజికల్, న్యూమరికల్ సామర్థ్యంపై 60 నిమిషాల్లో 60 ప్రశ్నలు) రాయాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మెరిట్-కమ్-మీన్స్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. మొత్తం 5,000 మందికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు

డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి లక్ష్యాలకు అందుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఎంపిక చేసిన సాంకేతిక రంగాల నుండి 100 మంది విద్యార్థులను ఇందులో చేర్చుకుంటుంది.

అర్హత ప్రమాణాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ వంటి కోర్సుల్లో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అర్హులు.

అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. గేట్ స్కోరు 550 నుండి 1,000 మధ్య లేదా అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలలో 7.5 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ ఉండాలి. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కాలానికి రూ. 6 లక్షల వరకు అందిస్తుంది. ట్యూషన్, విద్యా ఖర్చుల కోసం 80 శాతం నిధులు ముందుగానే విడుదల చేస్తారు. మిగిలిన 20 శాతం నిధులు కాన్ఫరెన్స్‌లు వంటి వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

అర్హత ప్రశ్నాపత్రం, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. వ్యక్తిగత, విద్యా, పాఠ్యేతర వివరాలతో పాటు రెండు రెఫరెన్స్ లెటర్లు, రెండు వ్యాసాలు (పర్సనల్ స్టేట్‌మెంట్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్) సమర్పించాలి. 60 నిమిషాల ఆప్టిట్యూడ్ పరీక్ష రాయాలి. దరఖాస్తులను నిపుణుల కమిటీ ద్వారా పరిశీలిస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేస్తారు.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు అక్టోబర్ 7, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు scholarships.reliancefoundation.org అనే అధికారిక రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా 7977 100 100 నంబర్‌కు, హెల్ప్‌లైన్ (011) 4117 1414 నంబర్‌కు సంప్రదించవచ్చు. UG దరఖాస్తుదారులు [email protected] కు, PG దరఖాస్తుదారులు [email protected] కు ఇమెయిల్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+