'పాక్పై అణుబాంబు వేయండి, మోడీ ఏం చేయట్లేదు'
సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎన్నోసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, అలాంటి పాక్ పైన ఒక్క అణుబాంబా వేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ఆచార్య ధర్మేంద్ర.
లక్నో: సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎన్నోసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, అలాంటి పాక్ పైన ఒక్క అణుబాంబా వేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ఆచార్య ధర్మేంద్ర సూచించారు.

అణుబాంబు వేయండి
కాల్పుల విరమణ ఒప్పందానికి నిత్యమూ తూట్లు పొడుస్తూ, భారత పోస్టులపై దాడులు చేస్తున్న దాయాది పైన ఓ అణుబాంబు వేయాలన్నారు. భారత ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే, పాక్ పైన అణుబాంబు వేసి వారిని కోలుకోలేని దెబ్బతీయడం ఒక్కటే మార్గమన్నారు.

పాకిస్తాన్ మనకు శత్రు దేశం
రాజస్థాన్లోని కోటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్ పొరుగు దేశం కాదని, అది మన దేశానికి శత్రు దేశమని ధర్మేంద్ర అభివర్ణించారు.

మహాత్మా గాంధీయే కారణం
భారత్, పాకిస్థాన్ల మధ్య ఈ వివాదానికి జాతిపితగా భారతీయులు కొలుచుకునే మహాత్మా గాంధీ కారణమని ధర్మేంద్ర ఆరోపించారు. అసలు దేశ కరెన్సీ మీద ఆయన చిత్రాలను ఎందుకని ప్రశ్నించారు.

నరేంద్ర మోడీపై విమర్శలు
గోవును జాతీయ మాతగా ప్రకటించాలని ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం టాయిలెట్లు కట్టించడంపై మాత్రమే దృష్టిని సారించిందని ఆచార్య ధర్మేంద్ర విమర్శించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications