మిజోరాంలో భూ ప్రకంపనాలు, రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు..
మిజోరాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.0 గా నమోదైంది. ఆగ్నేయ చాంపయికి 98 కిలోమీటర్ల దూరంలో గురువారం రాత్రి 7.29 గంటలకు భూమి కంపించింది. దీంతో జనాలు భయపడి పోయారని, ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. భూ ప్రకంపనాలు వచ్చినట్టు జాతీయ సిస్మాలజీ కేంద్రం ధృవీకరించింది.

చాంపయి వద్ద మాత్రమే భూమి కంపించిందని.. మిగతా చోట్ల ప్రభావం లేదని తెలుస్తోంది. స్వల్ప భూకంపం కావడంతో ఆస్తి నష్టం పెద్దగా జరిగి ఉండకపోవచ్చు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలేమీ తెలియరాలేదు. అయితే దేశంలో స్వల్పంగా భూమి కంపిస్తూనే ఉంది. ఆదివారం గుజరాత్ రాజ్ కోట్ వద్ద కూడా భూకంపం వ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ కూడా ఇటీవల భూమి పలుమార్లు కంపించింది.












Click it and Unblock the Notifications