గుజరాత్: రాజ్కోట్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం, జనం పరుగులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్కోట్, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రాజ్కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం రాత్రి 8.13 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
Recommended Video
రిక్టారు స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా, భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

భూకంపం సంభవించినట్లు తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజ్ కోట్, కచ్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిపై సమీక్షించారు.
ఇది ఇలావుంటే, టర్కీలో కూడా 20 నిమిషాలపాటు భూకంపం సంభవించినట్లు తెలిసింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications