డ్రగ్స్: కాశ్మీర్లో భర్తలను వదిలేస్తున్నారు
శ్రీనగర్: చెడు వ్యసనాలకు బానిసలైన భర్తలను భార్యలు వదిలేస్తున్నారు. కచ్చితంగా భర్తతో విడాకులు తీసుకుని బుద్ది చెబుతున్నారు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా, సమాజం ఛీకొడుతున్నా జమ్మూ కాశ్మీర్ లోని మహిళలు వెనక్కి తగ్గడం లేదు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భర్తకు రిఫాత్ (27) అనే మహిళ విడాకులు ఇచ్చింది. స్థానిక షిరియా కోర్టు సాయంతో ఇటీవల భర్తలకు విడాకులు ఇచ్చిన వారి సంఖ్య ఒక నెలలో 40కి చేరింది.
మహిళలు ఏదైనా తప్పు చేస్తే భర్తలు వెంటనే విడాకులు ఇచ్చేస్తారని, అలాంటిది తాము ఎందుకు విడాకులు ఇవ్వరాదని రిఫాత్ ప్రశ్నిస్తున్నారు. పురుషులకు మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉందని అనుకోవడం తప్పు అని ఆమె అంటున్నది.
కాశ్మీర్ లో డ్రగ్స్ కు అలవాటు పడిన భర్తలకు ఇటీవల కాలంలో భార్యలు విడాకులు ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసిందని కాశ్మీర్ గ్రాండ్ ముప్తీ నసీరుల్ ఇస్లాం తెలిపారు. షరియా కోర్టు విడాకుల కేసులను మోడికల్ బోర్డులకు పంపిన తరువాత నిర్ణయం తీసుకుంటున్నది.