దమ్ముందా: ఈసికి అజం ఖాన్ సవాల్, మోడీపై లాలూ
లక్నో: కేంద్ర ఎన్నికల సంఘం పైన సమాజ్ వాది పార్టీ నేత, మంత్రి అజం ఖాన్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం తాను ఏదో భగవంతుడిని అన్నట్లుగా వ్యవహరిస్తోందని ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్లో ప్రచారం చేయకుండా తనను నిషేధించిన ఈసికి దమ్ముంటే.. తన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సవాల్ విసిరారు. రాజ్యాంగస్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండేలా ఎన్నికల కమిషన్ నడుచుకోవాలన్నారు.

మోడీనే పంపించాలి: లాలూ
నరేంద్ర మోడీపై ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. మోడీని పాకిస్తాన్కు పంపించాలన్నారు. మోడీని పాకిస్తాన్కు పంపించడమే ఆయనకు సరయిన మందు అన్నారు. ఆయన పార్టీ మనుషులు ఇతరులను పాకిస్తాన్కు పంపించడం గురించి మాట్లాడుతున్నారని, వాళ్లకు బదులు మోడీనే పాక్కు పంపించాలని గురువారం అన్నారు.
బిజెపి మండిపాటు
లాలూ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. మోడీకి బదులు లాలూనే ఎందుకు పాక్కు పంపించకూడదన్నారు.
దేశంలో తానే పాపులర్ అని లాలూ చెప్పుకుంటారని, అందువల్ల ఆయననే అక్కడికి పంపించడం తెలివైన నిర్ణయం అవుతుందన్నారు. భారత్ గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్, దాని మంత్రులు తమ హద్దుల్లో ఉండడం మంచిదన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం వాళ్లకు లేదని, తమ ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్ణయించాల్సింది ఈ దేశ ప్రజలే అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications