ఎన్నికల రాష్ట్రాల్లో పార్టీలకు షాక్- ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగించే యోచనలో ఈసీ
ఉత్తర్ ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీలు, సభలు, రోడ్ షోలపై ఈసీ నిషేధం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ లో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఓసారి పొడిగించింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ నిషేధాన్ని పొడిగించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత జనవరి 15 వరకూ ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై ప్రకటించిన నిషేధాన్ని ఈసీ మరో వారం పాటు పొడిగించింది. ఆ గడువు కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇవాళ సాయంత్రానికి ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని కోసం అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈసీ ఆంక్షలతో అభ్యర్ధులు ఇళ్ల వద్ద నుంచే వర్చువల్ ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి, సభలు పెడితేనే ఓట్లు పడతాయో లేదో తెలియని పరిస్దితుల్లో వర్చువల్ ప్రచారాలతో తీవ్ర నష్టం జరుగుతందని పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పరిమితంగానైనా ప్రచారానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరుతున్నాయి.

Recommended Video
అయితే ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. అలాగే వ్యాక్సినేషన్ కూడా వందశాతం పూర్తి కాలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని వదిలేస్తే భారీ ఎత్తున కోవిడ్ వ్యాప్తికి అవకాశం ఉందన్న నివేదికలు వస్తున్నాయి. దీంతో మరో వారం రోజులైనా భౌతిక ప్రచారంపై ఆంక్షలు కొనసాగించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసీ ఆంక్షలతో పార్టీలు కేవలం 300 మందికి మించకుండా జనంతో ఇండోర్ మీటింగ్ లు మాత్రం పెట్టుకుంటున్నాయి. ఈసీ త్వరలో ఆంక్షలు ఎత్తేస్తుందని రాజకీయ పార్టీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications