రద్దుచేసిన నగదు మార్చాడు. ఈడీ అధికారులకు దొరికాడిలా
నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు చేసే ప్రయత్నాలకు కొందరు బ్యాంకు మేనేజర్లు సహకరిస్తున్నారు. వీరి సహకారంతో బడాబాబులు నల్ల ధనాన్ని మార్చుకొంటున్నారు.
న్యూఢిల్లీ :నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు చేసే ప్రయత్నాలకు కొందరు బ్యాంకు మేనేజర్లు సహకరిస్తున్నారు. వీరి సహకారంతో బడాబాబులు నల్ల ధనాన్ని మార్చుకొంటున్నారు. ఇవే ఆరోపణలపై న్యూఢిల్లీలోని కోటక్ మహేంద్ర బ్యాంకు మేనేజర్ ను ఈడీ అధికారులు బుదవారం నాడు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీలోని కస్తూర్భాగాందీ మార్గ్ లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు మేనేజర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రద్దుచేసిన నగదును తీసుకొని కొత్త కరెన్సీని మార్చారనే కారణంతో ఆయనను ఈడీ అధికారులు బుదవారం నాడు అరెస్ట చేశారు.
ఈ బ్యాంకు మేనేజర్ అక్రమంగా నల్లధనం మార్పిడి చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. పరాస్ మాల్ లోథా, రోహిత్ టాండన్ లకు నల్ల ధనాన్ని మార్పిడి చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.

కోల్ కత్తాకు చెందిన పరాస్ మాల్ లోథా ను నవంబర్ 21 వ, తేదిన ముంబాయిలో ఈడీ అధికారులు అరెస్టుచేశారుఅతను 25 కోట్లను అక్రమంగా మార్పిడి చేసుకొన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
కొత్త కరెన్సీ కోసం సామాన్యులు కష్టాలు పడుతోంటే అక్రమార్కులకు పెద్ద మొత్తంలో నోట్లను కట్టబెట్టేందుకు బ్యాంకు మేనేజర్లు సహకరిస్తున్నారు. అక్రమార్కులకు సహకరించిన బ్యాంకు మేనేజర్లను ఈడీ అధికారులు అరెస్టుచేస్తున్నారు. కోటక్ మహేంద్ర బ్యాంకు మేనేజర్ అరెస్టుతో మరింత మంది అక్రమాలకు సహకిరంచిన వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications