Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా విపత్తులో భారత్‌కు అండగా యూరోపియన్ యూనియన్... అవసరమైన సాయం అందిస్తామని ప్రకటన...

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు యూరోపియన్ యూనియన్ అండగా నిలిచింది. కష్ట కాలంలో భారత్‌కు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్‌లోని 27 సభ్య దేశాలు శనివారం(మే 8) వర్చువల్ పద్దతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వొన్ దెర్ లీయెన్ మాట్లాడుతూ... 'ఈరోజు నరేంద్ర మోదీతో నిర్వహిస్తున్న ఈ సమావేశం సరైన సమయంలో జరుగుతున్నది కాకపోవచ్చు. అయితే ఈ కష్ట కాలంలో యూరోపియన్ యూనియన్ భారత్‌కు అండగా నిలుస్తుంది. భారత్‌తో యూరోపియన్ యూనియన్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు,వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరిన్ని చర్చలు జరుపుతాం. భారత్-ఈయూ రెండూ కలిసి పనిచేయడం ద్వారా ఎంతో సాధించవచ్చు.' అని పేర్కొన్నారు.

eu announces we stands at indias side mea says its a watershed moment

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని సమావేశం అనంతరం భారత్-ఈయూ ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
భారత్-ఈయూ మధ్య తాజా సమావేశం చారిత్రాత్మకమైనదిగా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌కు అండగా నిలవాలన్న యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నిర్ణయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కరోనా మహమ్మారిపై పోరుతో పాటు భారత్-ఈయూ మధ్య వాణిజ్యం,పెట్టుబడులు,కనెక్టివిటీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇదే సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాట్లాడుతూ... గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలో భారత్ ఎన్నో దేశాలకు మెడికల్ వస్తువులను సప్లై చేసిందన్నారు. స్పానిష్,బెల్జియం ప్రధానులు కూడా ఇదే అభిప్రాయపడ్డారు. కష్ట కాలంలో తమను ఆదుకున్న భారత్‌కు ఇప్పుడు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు పలు రూపాల్లో సాయం అందింది.యూరోపియ‌న్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు. భారత్‌లో జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్ ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్‌ను విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా రోజుకు 4లక్షల లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈయూ నుంచి అందుతున్న ఈ సాయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+