కరోనా విపత్తులో భారత్కు అండగా యూరోపియన్ యూనియన్... అవసరమైన సాయం అందిస్తామని ప్రకటన...
కరోనా సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్కు యూరోపియన్ యూనియన్ అండగా నిలిచింది. కష్ట కాలంలో భారత్కు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్లోని 27 సభ్య దేశాలు శనివారం(మే 8) వర్చువల్ పద్దతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వొన్ దెర్ లీయెన్ మాట్లాడుతూ... 'ఈరోజు నరేంద్ర మోదీతో నిర్వహిస్తున్న ఈ సమావేశం సరైన సమయంలో జరుగుతున్నది కాకపోవచ్చు. అయితే ఈ కష్ట కాలంలో యూరోపియన్ యూనియన్ భారత్కు అండగా నిలుస్తుంది. భారత్తో యూరోపియన్ యూనియన్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు,వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరిన్ని చర్చలు జరుపుతాం. భారత్-ఈయూ రెండూ కలిసి పనిచేయడం ద్వారా ఎంతో సాధించవచ్చు.' అని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని సమావేశం అనంతరం భారత్-ఈయూ ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
భారత్-ఈయూ మధ్య తాజా సమావేశం చారిత్రాత్మకమైనదిగా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్కు అండగా నిలవాలన్న యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నిర్ణయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కరోనా మహమ్మారిపై పోరుతో పాటు భారత్-ఈయూ మధ్య వాణిజ్యం,పెట్టుబడులు,కనెక్టివిటీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
Today’s meeting with @narendramodi could not be more timely.
— Ursula von der Leyen (@vonderleyen) May 8, 2021
The EU stands at India’s side in this most challenging time.
We will also discuss how to further strengthen our strategic partnership.
The 🇪🇺 and 🇮🇳 can achieve a lot more by working “Ek Saath” – together. pic.twitter.com/HsZmDtEsLD
ఇదే సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాట్లాడుతూ... గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలో భారత్ ఎన్నో దేశాలకు మెడికల్ వస్తువులను సప్లై చేసిందన్నారు. స్పానిష్,బెల్జియం ప్రధానులు కూడా ఇదే అభిప్రాయపడ్డారు. కష్ట కాలంలో తమను ఆదుకున్న భారత్కు ఇప్పుడు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు పలు రూపాల్లో సాయం అందింది.యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఈఐబీ) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు. భారత్లో జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్ ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్ను విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా రోజుకు 4లక్షల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయవచ్చు. ఈయూ నుంచి అందుతున్న ఈ సాయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications