అంబేద్కర్ కూడా చేయలేరు: రాహుల్ సహా ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని మోడీ.. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని స్పష్టం చేశారు.
దేశంలో అత్యయిక పరిస్థితి విధించటం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు. రాజస్థాన్లోని బాఢ్మేర్ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.

దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. అందుకే సరిహద్దు ప్రాంత జిల్లాలు అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉన్నాయని ప్రధాని ఆక్షేపించారు. దేశానికి ఇరువైపులా ఉన్న పొరుగుదేశాల వద్ద అణ్వాయుధాలు కలిగి ఉండగా.. మనం మాత్రం వాటిని ధ్వంసం చేయాలా? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఇండి కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మేలుచేసే విధంగా ఆలోచిస్తున్నాయని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.
'ఇండి కూటమిలోని మరో పార్టీ దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకర ప్రకటన చేసింది. దానిని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. పోఖ్రాన్ గడ్డ భారత్ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. ఇండి కూటమిలోని పార్టీ దేశంలోని అణ్వాయుధాలను ధ్వంసం చేసి సముద్రంలో పారేస్తామని ప్రకటించింది. పొరుగు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండగా, మన దేశంలో వాటిని ధ్వంసం చేయాలని ఇండి కూటమిలోని పార్టీ ఆలోచిస్తోంది. నేను కాంగ్రెస్ను ఒక్క విషయం అడగాలని అనుకుంటున్నాను. ఇండి కూటమిలోని ఆ పార్టీ ఎవరి సూచనలతో పనిచేస్తోంది. ఇదే మీ కూటమి దేశాన్ని బలహీనం చేయాలని భావిస్తోంది' అని ప్రధాని మోడీ మండిపడ్డారు.
भाजपा सरकार देश की आखिरी सीमा तक सड़कें और हाइवे बना रही है।
— BJP Rajasthan (@BJP4Rajasthan) April 12, 2024
हमने बाड़मेर में मेडिकल कॉलेज भी खोला है।
आज सीमावर्ती बाड़मेर में 72,000 करोड़ रुपये लागत की रिफाइनरी शुरू होने जा रही है।
आने वाले समय में इस इलाके में रोजगार के अवसर पैदा होंगे, युवाओं के लिए नए रास्ते बनेंगे।
-… pic.twitter.com/WbqQfY1tMS
జమ్మూకాశ్మీర్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన
అంతకుముందు జమ్మూకాశ్మీర్లోని ఉధంపుర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోడీ. జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయన్నారు. జమ్ముకశ్మీర్లో ఈసారి లోక్సభ ఎన్నికలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, దాడులు, రాళ్లు రువ్వటం, సరిహద్దుల్లో కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
370 అధికరణ రద్దు ద్వారా చాలా ఏళ్లుగా జమ్మూకాశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికినట్లు ప్రధాని మోడీ వివరించారు. తమ ప్రభుత్వం రద్దు చేసిన 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయపక్షాలకు ప్రధాని మోడీ సవాల్ విసిరారు. జమ్ముకాశ్మీర్ అభివృద్ధి పథంలో సాగుతోందని, తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందన్నారు ప్రధాని మోడీ.
SC/ ST और OBC भाई-बहनों के साथ दशकों तक भेदभाव करने वाली कांग्रेस आजकल एक पुराना रिकॉर्ड बजा रही है।
— BJP Rajasthan (@BJP4Rajasthan) April 12, 2024
जब भी चुनाव आता है, संविधान के नाम पर झूठ बोलना INDI अलायंस के सभी दलों का फैशन बन गया है।
- प्रधानमंत्री श्री @narendramodi pic.twitter.com/TW7hTCgO8O
భారత్ను శక్తిమంతంగా మార్చేందుకు తాను శ్రమిస్తుంటే ఇండి కూటమి నేతలు దేశాన్ని బలహీనపర్చే చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. 'మోడీ వికసిత్ భారత్ కోసం వికసిత్ జమ్ముకశ్మీర్ నిర్మాణానికి గ్యారంటీ ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు జమ్ముకశ్మీర్ను మళ్లీ పాత రోజుల దిశగా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ కుటుంబాల ద్వారా నడిచే పార్టీలు జమ్ముకశ్మీర్కు ఎవరూ చేయనంత నష్టం చేశాయి. ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే కుటుంబం చేత, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. మరోసారి బీజేపీ పట్టం కట్టి అభివృద్ధిని కొనసాగించాలన్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!











Click it and Unblock the Notifications