Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పళనిసామి బలపరిక్ష: కోర్టుకు వెళ్లాలని చెప్పిన గవర్నర్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బలపరిక్షలో ఎవరికైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని గవవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచించారని తెలిసింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బలపరిక్షలో ఎవరికైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని గవవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచించారని తెలిసింది. మీకు అనుమానాలుంటే కోర్టుకు వెలితే న్యాయస్థానం నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తుందని గవర్నర్ సూచించారని సమాచారం.

శనివారం తమిళనాడు సచివాలయంలో బలపరిక్షసందర్బంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదిక కోరారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావ్ జోక్యం చేసుకునే అవకాశం లేదు.

డీఎంకే, పన్నీర్ ఫిర్యాదు

డీఎంకే, పన్నీర్ ఫిర్యాదు

అసెంబ్లీలో ఎడప్పాడి పళనిసామి బలపరిక్ష నియమాలకు విరుద్దంగా జరిగిందని తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు.

అనుమానాలు లేవు

అనుమానాలు లేవు

అయితే గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇచ్చిన నివేదికలో ఎడప్పాడి పళనిసామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారందరూ ఆయనకు ఓటు వేశారని అధికారులు పూర్తి సమాచారం ఇచ్చారు. ప్రతిపక్షాలు ఉన్నా, రహస్య ఓటింగ్ జరిగినా 122 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి ఓటు వేసేవారని అధికారులు నివేదిక తెలిపారని సమాచారం.

స్పీకర్ ఎలా వ్యవహరించారు ?

స్పీకర్ ఎలా వ్యవహరించారు ?

అసెంబ్లీలో బలపరిక్ష ఎలా నిర్వహించాలి అనే విషయం స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ విషయంపై తాను నివేదిక ఇవ్వాలని అడుగుతానని గవర్నర్ విద్యాసాగర్ రావు చెప్పారు. అయితే స్పీకర్ నిర్ణయం విషయంలో తాను జోక్యం చేసుకోనని గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

స్పీకర్ కు ఆ అధికారం ఉంది

స్పీకర్ కు ఆ అధికారం ఉంది

ఓటింగ్ ఎలా నిర్వహించాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉందని, ఆయన తీసుకునే నిర్ణయం విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకునే అవకాశం లేదని సమాచారం. అయితే స్పీకర్ ధనపాల్ పక్షపాత వైఖరితో వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

కోర్టును ఆశ్రయించండి

కోర్టును ఆశ్రయించండి

స్పీకర్ ధనపాల్ మీద ఆరోపణలు చేస్తున్న వారు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, పన్నీర్ సెల్వం వర్గీయులకు సూచించారని తెలిసింది. కోర్టు నివేదిక తెప్పించుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గవర్నర్ విద్యాసాగర్ రావు ఫిర్యాదు చేసిన స్టాలిన్, పన్నీర్ సెల్వం వర్గీయులకు సూచించిందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+