పీఎన్బీ స్కాం: అతిపెద్ద పురోగతి.. నీరవ్ మోడీ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ను ఐటీ పట్టేసింది!
న్యూఢిల్లీ : వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఆదాయపన్ను శాఖ అతిపెద్ద పురోగతి సాధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ 'సీక్రెట్' బ్యాంకు అకౌంట్ను ఐటీ డిపార్ట్మెంట్ కనిపెట్టేసింది.
లండన్లోని బార్క్లేస్ పీఎల్సీ బ్యాంక్లో నీరవ్కు ఈ అకౌంట్ ఉన్నట్టు ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఇండియాటుడే.ఇన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు.

లండన్లోని బార్క్లేస్ పీఎల్సీ బ్యాంక్లో...
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్లోని బార్క్లేస్ పీఎల్సీ బ్యాంక్లో మోడీ లిమిటెడ్ పేరుతో ఓ ‘సీక్రెట్' బ్యాంకు అకౌంట్ను తెరిచినట్టు ఆదాయపన్ను శాఖ అధికారులు తెలుసుకోగలిగారు. విచారణ అనంతరం ఈ అకౌంట్ నీరవ్ మోడీకి చెందిన వ్యక్తిగత అకౌంట్గా బహిర్గతమైనట్టు వెల్లడైందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు.

అకౌంట్లో రూ.9-10 కోట్లకుపైగా బ్యాలెన్స్ ...
తన వ్యక్తిగత డిపాజిట్ల కోసం ఈ అకౌంట్ను నీరవ్ ఆపరేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నీరవ్ మోడీకి చెందిన ఈ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.9-10 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు ముంబై మెట్రోపాలిటన్ కోర్టు నీరవ్ మోడీ సీక్రెట్ బ్యాంకు అకౌంట్కు చెందిన మనీ వివరాలపై ‘లెటర్ రోగటరీ(ఎల్ఆర్)' ని యూకేకు, లండన్కు పంపింది.

ఇక మరిన్ని బయటికొస్తాయి...
లండన్లోని బార్క్లేస్ పీఎల్సీ బ్యాంక్లో ఉన్న నీరవ్ మోడీ సీక్రెట్ బ్యాంకు అకౌంట్ను ఆధారంగా చేసుకుని, బార్క్లేస్ పీఎల్సీ బ్యాంకు, విదేశీ అధికారులు మరిన్ని వివరాలు తమతో షేర్ చేసుకునే అవకాశాలున్నాయని, దీంతో నీరవ్, మెహుల్ చౌక్సి పేర్లతో ఉన్న ఇలాంటి దాచి ఉంచిన అకౌంట్లను తాము గుర్తించగలుగుతామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లు...
పంజాబ్ నేనషల్ బ్యాంకు హామీతో విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల రుణాలను దారి మళ్లించడం కోసం భారత్తో సహా 15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లను నీరవ్ మోడీ, మెహుల్ చౌక్సిలు తెరిచినట్టు దర్యాప్తు సంస్థలు ఇండియాటుడే.ఇన్కి ధృవీకరించాయి. ఈ బ్యాంకు అకౌంట్లను వందల కొద్దీ షెల్ కంపెనీలు, బోగస్ డైరెక్టర్ల పేర్లతో తెరిచినట్టు తెలుస్తోంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్స్లోనూ చెప్పలేదు...
పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ ఇప్పటి వరకు తన బ్యాంకు అకౌంట్ల వివరాలను భారత ప్రభుత్వానికి బహిర్గతం చేయలేదు. ఐటీ రిటర్నుల ఫైలింగ్స్లోనూ అతడు వీటి గురించి పేర్కొనలేదు. ఇప్పటి వరకు విదేశీ బ్యాంకు అకౌంట్లు, ప్రాపర్టీల వివరాల కోసం ఈడీ 15పైగా దేశాలకు ఎల్ఆర్లను జారీచేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications