మొహాలీలో ఇంటెలీజెన్స్ యూనిట్ వద్ద పేలుడు
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు నిఘా విభాగం వెలుపల పేలుడు సంభవించింది. ఆఫీస్ సమీపంలో పేలుడు పదార్థాలు పేలాయని, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆరా తీశారు. నిరంతరం అధికారులతో టచ్ లో ఉన్నారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సోమవారం రాత్రి రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించిందని, ఎటువంటి ఆస్తి నష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు, వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, ఫోరెన్సిక్ బృందాలను కూడా పిలిచినట్లు వార్తా సంస్థ నివేదించింది.
ఏప్రిల్ 24న చండీగఢ్లోని బురైల్ జైలు సమీపంలో పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications