మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలు: రైల్వే స్టేషన్లో అరెస్ట్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్యాసింజెర్ నుంచి భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ రైలు ప్రయాణికురాలి నుంచి పోలీసులు 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై-మంగుళూరు సూపర్ఫాస్ట్ రైలులో వచ్చిన సదరు ప్రయాణికురాలి నుంచి ఈ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చెన్నైకు చెందిన ఆ మహిళను కస్టడీలోకి తీసుకున్నారు.

నిందిత మహిళ కూర్చున్న సీటు కింద పేలుడు పదార్ధులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చెన్నై నుంచి కేరళలోని తలసరేకు వెళ్తోందామె. ఆ పేలుడు పదార్ధాలతో ఆమే ఏం చేయబోతోంది.. ఆమెకు వాటితో సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుంచే గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications