వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకూ సాయం చేయండి: సుష్మాకు పాక్ వ్యక్తి విజ్ఞప్తి, స్పందించిన మంత్రి

‘భారత్, పాక్ ఘర్షణల కారణంగా నా బిడ్డ ఎందుకు బాధపడాలి. సర్తాజ్ అజీజ్ లేదా సుష్మా మేడమ్.. చెప్పండి’ అని సుష్మాని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందించిన సుష్మా.. ‘లేదు. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనకు వచ్చిన వినతుల పట్ల ఎంత వేగంగా స్పందిస్తారో అందరికీ తెలిసిన విషయమే. సాయం కావాలని కోరగానే వెంటనే అందుకు సంబంధించిన చర్యలు చేపడతారు.

ఇటీవల పాకిస్థాన్‌లో చిత్రహింసలకు గురైన భారత మహిళ ఉజ్మాను స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకున్నారు సుష్మా. ఇందుకు ఉజ్మా కన్నీళ్లపర్యాంతమవుతూ సుష్మాకు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశం వచ్చిన వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి పునర్ జన్మనిచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.

కాగా, ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. సుష్మా సాయాన్ని కోరారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌కి చెందిన కెన్ సిద్ అనే సివిల్ ఇంజినీర్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన నెలల పసికందుకి భారతదేశంలో చికిత్స చేయించడానికి వీసా వచ్చేలా చూడాలని ట్విట్టర్ ద్వారా కోరాడు.

'భారత్, పాక్ ఘర్షణల కారణంగా నా బిడ్డ ఎందుకు బాధపడాలి. సర్తాజ్ అజీజ్ లేదా సుష్మా మేడమ్.. చెప్పండి' అని సుష్మాని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందించిన సుష్మా.. 'లేదు. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు. మీ ముందు పాక్‌లోని భారత హైకమిషన్‌ను సంప్రదించండి. ఆ తర్వాత మెడికల్ వీసా వచ్చేలా చూస్తాం' అని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన కెన్ సిద్.. చాలా సంతోషమంటూ సుష్మాకు ధన్యవాదాలు తెలిపాడు.

English summary
External Affairs Minister Sushma Swaraj on Wednesday assured a Pakistani man of a medical visa so that his two and a half-month-old infant, who is suffering from a heart disease, can be brought to India for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X