Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటీఎంలు పని చేయవా?, ఆన్‌లైన్ నగదు బదిలీ చేయకూడదా?: ఎస్బీఐ ఏం చెబుతోంది

India Pakistan War: పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్‌ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది.

భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అవుతోంది.

Fact Check A WhatsApp message claims ATMs will be closed for 2-3 days is Fake says Centre

అదే సమయంలో- పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు భారత్‌పై విషం చిమ్ముతున్నాయి. దుష్ప్రచారానికి తెర తీశాయి. పాత వీడియోలను తవ్వి తీసి తాజాగా పోస్ట్ చేస్తోన్నాయి. భారత్‌లోని పలు కీలక ఆర్మీ పోస్టులను నిర్వీర్యం చేసినట్లు చెప్పుకొంటోన్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపై విధ్వంసక దాడిని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.

మొదట భారత ఆర్మీపై ఉగ్రవాదుల ఆత్మాహూతి దళాలు దాడులు చేశాయని, పెద్ద ఎత్తున నష్టం సంభవించిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు పోస్ట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో ఈ దాడి జరిగిందని, ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే ప్రచారం సాగింది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అవాస్తవమని తేల్చి చెప్పింది.

అదే సమయంలో గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పైనా పాకిస్తాన్ భయానక దాడి సాగించినట్లు కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఆ వీడియోలు నిజమే అయినప్పటికీ- ఇప్పటివి కావు. 2021 జులై 7వ తేదీన హజీరా పోర్ట్‌లో ఓ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించిన వీడియోలు అవి. వాటిని ఇప్పుడు సర్కులేట్ చేస్తోన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. దీన్ని నమ్మవద్దని కోరింది.

దీనికి ఇక్కడితో బ్రేకులు పడట్లేదు. మరింత విస్తరిస్తూనే ఉన్నాయి. ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్.. సోషల్ మీడియా వేదికపై పోస్ట్ అవుతూనే వస్తోన్నాయి. భారత్‌తో యుద్ధం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్.. భారత్‌లోని అన్ని ఏటీఏంలపై సైబర్ దాడికి ప్రిపేర్ అయిందంటూ వార్తలు వచ్చాయి.

ఈ వాట్సప్‌లో ఈ సమాచారం పెద్ద ఎత్తున సర్కులేట్ అయింది. రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడతాయని, వినియోగదారులు కూడా ఎటువంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించకూడదనేది ఈ వాట్సప్ మెసేజీల సారాంశం. తెలియని అడ్రస్‌ల నుంచి ఇమెయిల్‌కు వచ్చిన ఏ లింక్ గానీ, అటాచ్‌మెంట్ గానీ క్లిక్ చేయొద్దని, అవి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చని ఇందులో రాశారు.

దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ ఫ్యాక్ట్ చెక్ ఇచ్చింది. ఈ వార్తలు అవాస్తవమని తేల్చింది. ఇందులో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఏటీఎంలు యధాతథంగా పని చేస్తాయని, బ్యాంక్ ఖాతాదారులు ఎటువంటి ఉద్రిక్తతలకు గురి కావొద్దని సూచించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు, డిజిటల్ సర్వీసులు పూర్తిస్థాయిలో పని చేస్తాయని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+