షాక్: ‘దిస్ ఈజ్ షూటింగ్ పర్పస్’! ఏటీఎం నుంచి రూ.2వేల ఫేక్ నోటు
కర్ణాటకలోని బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో వచ్చిన నోటును చూసి షాకయ్యాడు. అది నకిలీ నోటు అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో వచ్చిన నోటును చూసి షాకయ్యాడు. అది నకిలీ నోటు అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. దయానందరెడ్డి అనే వ్యక్తి లక్కసంద్ర రెండో క్రాస్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ. 6వేల నగదు డ్రా చేశారు. కాగా, మూడు రూ.2వేల నోట్లు వచ్చాయి. ఆ తర్వాత సమీపంలోని పెట్రోల్ బంక్కు వెళ్లి.. ఏటీఎం నుంచి తీసిన ఓ రూ.2వేల నోటు ఇచ్చారు.

అయితే, దయానంద్ ఇచ్చింది నకిలీ రూ.2వేల నోటు అని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది, ఆ నోటను తీసుకోలేదు. దీంతో దయానంద్ ఆ నోటును పరిశీలనగా చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
ఆ నోటు మీద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట.. 'దిస్ ఈజ్ షూటింగ్ పర్పస్ ఓన్లీ' అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉండటం గమనార్హం. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని అని చెప్పారు.
అంతేగాక, యాక్సిస్ బ్యాంకుకు వెళ్లి ఆ నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయారు. తాజాగా విడుదలైన కొత్త రూ.2వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66మి.మీ ఉంటుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications