Family: ఒకే ఫ్యామిలీలో నలుగురు ఆత్మహత్య, 15 రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి, ఉద్యోగం చేస్తున్న భార్య !
బెంగళూరు/ మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు కుమారుడు ఉన్నారు. దంపతులు అన్యోన్యంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు బందువులు అనుకున్నారు. దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి 15 రోజుల క్రితమే వేరే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. అద్దె ఇల్లు తీసుకుని దంపతులు కాపురం పెట్టారు. అంతే రాత్రి ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు అందరూ శవాలై కనిపించడం కలకలం రేపింది.

దంపతులకు ఇద్దరు పిల్లలు
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బిళగి తాలుకా సునగ ప్రాంతంలో నాగేష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం విజయలక్ష్మి (29) అనే యువతిని నాగేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాగేష్ ,విజయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

15 రోజుల క్రితం కొత్త ఇంట్లోకి !
నాగేష్, విజయలక్ష్మి దంపతులకు స్వప్నా (8) అనే కూతురు, సమర్థ్ (4) అనే కుమారుడు ఉన్నారు. ఇంతకాలం బాగల్ కోటేలోనే నాగేష్ , విజయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉండేవారు. 15 రోజుల క్రితం మంగళూరు చేరుకున్న నాగేష్, విజయలక్ష్మి దంపతులు మార్గన్స్ స్ట్రీట్ లో అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నారు.
Recommended Video

ఒకేసారి అందరూ ఆత్మహత్య
నాగేష్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళూరులోనే విజయలక్ష్మి లేడీ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. మంగళవారం రాత్రి దంపతులు ఇంట్లో టీవీ చూస్తున్న విషయం స్థానికులు గమనించారు. బుధవారం విజయలక్ష్మి, కూతురు స్వప్నా, కొడుకు సమర్థ్ ఇంట్లో శవమై కనిపించారు. అదే ఇంట్లో నాగేష్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య, ఇద్దరు పిల్లలకు విషయం పెట్టి హత్య చేసిన నాగేష్ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు ఒకేసారి శవాలై కనిపించడం మంగళూరులో కలకలం రేపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications