394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ ఘటనలో గాయపడ్డ పోలీసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 86 మంది వరకు గాయపడ్డారని ఉన్నతాధికారులు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య 394కి చేరింది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉంది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాత్సవ తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన రైతులు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. కానీ రైతులతో చర్చలు జరిగినా.. ట్రాక్టర్ల ర్యాలీ ఆగలేదని చెప్పారు.
రిపబ్లిక్ డే రోజున ర్యాలీ తీసేందుకు తొలుత అంగీకరించలేదని చెప్పారు. కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే వద్ద నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఢిల్లీలో నిర్వహిస్తామని తర్వాత చెప్పారని వివరించారు. రైతుల ర్యాలీకి సంబంధించి మూడు విడతల చర్చలు జరిపామని.. సింగూ, టిక్రీ, ఘజిపూర్ మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాలీకి సంబంధించి ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. కానీ వారు మార్గదర్శకాలను పాటించలేదని చెప్పారు. ఉదయం 7.30 గంటలకు సింగు సరిహద్దు నుంచి మార్చి ప్రారంభించాల్సి ఉందన్నారు.

మకార్బా చౌక్ వద్ద సత్నామ్ సింగ్ పన్ను రెచ్చగొట్టే ప్రసంగం చేశారని.. ఒప్పందాన్ని దర్శన్ పాల్ సింగ్ వమ్ము చేశారని ఢిల్లీ సీపీ తెలిపారు. ఘజిపూర్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారని.. కానీ వారికి మధ్యాహ్నం 12 గంటలకు రావాలని చెప్పామని సీపీ వివరించారు. రైతులను రైతు నేతలు రెచ్చగొట్టారని తెలిపారు. ఘజిపూర్ నుంచి వచ్చిన రాకేశ్ టికాట్ బృందం బారికేడ్లను ధ్వంసం చేశారని తెలిపారు. జరిగిన ఘర్షణలో 394 మంది పోలీసులు గాయపడగా.. చాలా మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. 30 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని.. వారిని నిలువరించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు. దాడి చేశారని భావిస్తోన్న 19 మందిని అరెస్ట్ చేశామని వివరించారు.
Recommended Video
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications