రైతుల ఆందోళన: ఆరు నెలలుగా వెనక్కు తగ్గని రైతులు, పరిష్కారం వెతకని కేంద్ర ప్రభుత్వం

రైతుల ఆందోళనలు

2020, నవంబర్ 26. పంజాబ్, హరియాణా, యూపీ నుంచి వేలాది రైతులు గుంపులు గుంపులుగా దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.

రైతులు రాజధానిలోకి చేరుకోకుండా జాతీయ రహదారి తవ్వేశారు. చలి రాత్రుల్లో వారిపై నీళ్లు కొట్టారు.

ఆ తర్వాత కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరికేంగా ప్రదర్శనలు చేసిన రైతులు దిల్లీ చుట్టుపక్కల సరిహద్దుల్లోనే గుడారాలు వేసుకుని ఉండిపోయారు.

2021 మే 26. వాతావరణం మారింది. ఎండలకు ఉక్కపోతగా ఉంది. రైతుల నిరసనలకు ఆరు నెలలు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లూ పూర్తయ్యాయి.

రైతు సంఘాల యునైటెడ్ ఫ్రంట్ మే 26న 'బ్లాగ్ ఫ్లాగ్ డే'గా ప్రకటించింది. వ్యవసాయ చట్టాలపై రైతులతో తక్షణం చర్చలు ప్రారంభించాలని, లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఈ నిరసనలు నిజానికి పంజాబ్, హరియాణాలో 2020 సెప్టెంబర్ నుంచే ప్రారంభమయ్యాయి.

కానీ, తమ గళం దిల్లీకి చేరడం లేదని అనిపించడంతో రైతులు గత ఏడాది నవంబర్‌లో దిల్లీ వైపు బయల్దేరారు. గత ఆరు నెలలుగా రైతులు రోడ్లపై గుడారాలు, ట్రాలీలనే తమ నివాసాలుగా మార్చుకున్నారు.

స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద, సుదీర్ఘ రైతు ఉద్యమం ఇదే. కానీ ఇది ఎలా మొదలైంది. ఈ ఆరు నెలల్లో రైతుల నిరనల్లో ఏమేం జరిగాయి. తెలుసుకుందాం.

2021 మే 21న 40 రైతు సంఘాల సమూహం యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశింది. మూడు వ్యవసాయ చట్టాలపై వెంటనే రైతులతో మళ్లీ చర్చలు ప్రారంభించాలని కోరింది.

"ప్రభుత్వం వైపు నుంచి జరిగిన చర్చలకు రైతులు పూర్తి సహకారం అందించారు. కానీ మా కనీస డిమాండ్లు, నిరసనలపై పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైంది" అని లేఖలో రాశారు. రైతులు "రైతులు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు, వేరే ఏదైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయ్యుంటే ఈ చట్టాలను వెనక్కు తీసుకునేది" అన్నారు.

రైతుల ఆందోళనలు

"మే 26న మేం బుద్ధపూర్ణిమ పూజలతో మేం ప్రారంభిస్తాం. ఎక్కడెక్కడ నిరసనలు జరుగుతున్నాయో, అక్కడ ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగరవేస్తాం. మేం పంజాబ్‌లో ర్యాలీ చేస్తున్నాం. కానీ, దిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ర్యాలీ లేదా పరేడ్ చేయడం లేదు" అని బీబీసీతో మాట్లాడిన యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ నేత దర్శన్‌పాల్ సింగ్ చెప్పారు.

"మేం మా డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఇక నరేంద్ర తోమర్(వ్యవసాయ మంత్రి) మేం ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకుని రాలేదంటున్నారు. ప్రభుత్వం మీది. ఆ పని మీరు చేయాలి. మేం మా డిమాండ్లు మీ ముందుంచాం. మా డిమాండ్లపై నిలబడ్డాం. మా ముందు తరాలవారి భవిష్యత్తు ప్రమాదంలో పడింది" అన్నారు.

ప్రభుత్వం, నిరసనలు చేస్తున్న రైతుల మధ్య గత నాలుగు నెలలుగా ఎలాంటి చర్చలు జరగలేదు. సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి న్యూస్ చానళ్లు, ప్రభుత్వ ఎజెండా నుంచి పూర్తిగా బయట ఉన్నట్లు కనిపిస్తోంది.

భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన ధర్మేంద్ర మలిక్ యూపీ గాజీపూర్ సరిహద్దు నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.

"మేం కరోనా ఉందని రైతులను ఇక్కడికి రావద్దని చెప్పాం. కానీ ఈసారీ నల్ల జెండాలు ప్రతి గ్రామంలో ఎగురుతాయి" అని బీబీసీతో అన్నారు.

రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు తక్కువగా జరిగాయని కాదు. లెక్కపెడితే కనీసం 11 సార్లు రెండు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఆ సమావేశాల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+