ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన: మూడో దఫా చర్చలు విఫలం; మళ్ళీ 18న చర్చలు!!
రాజధాని ఢిల్లీ సరిహద్దులలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనలో భాగంగా నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో భారత్ బంద్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రైతు సంఘాలు పెట్టిన డిమాండ్ల పరిష్కారం దొరకని కారణంగా ఇప్పటివరకు మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
ఈరోజు సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసులు చర్యలపై రైతు సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ప్రధానంగా రైతుసంఘాల నాయకులు చేస్తున్న డిమాండ్లలో మద్దతు ధరకు చట్టపరమైన హామీ, 2013 భూసేకరణచట్టం జాతీయస్థాయి అమలు, భూసేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మతితో పాటు కలెక్టర్ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు చెల్లింపు డిమాండ్ తదితర అంశాల పైన చర్చలు జరిపారు.

అయితే ఎంఎస్పికి చట్టబద్ధమైన హామీ అమలులో తలెత్తే సమస్యలపై కేంద్ర మంత్రులు రైతు సంఘాలకు వివరించి ఈ విషయం పైన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ చర్చలలో అనేక అంశాలపై ప్రభుత్వానికి రైతు సంఘాల నాయకులకు ఏకాభిప్రాయం కుదిరింది. అయినప్పటికీ రైతు సంఘాల నాయకులు మద్దతు ధర విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
అయితే రైతు సంఘాల నాయకుల డిమాండ్లపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు చర్చలు జరపనున్నట్టు కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఈ చర్చల ద్వారా శాంతియుత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఈరోజు రైతు సంఘాలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని, అనేక అంశాలపై నిర్ణయాలను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుత నిరసన కొనసాగుతుందని నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ స్పష్టం చేశారు. ఆదివారం సానుకూల ఫలితం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమపై హింసాత్మక చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు. తాము పాకిస్తాన్ వాళ్ళం కాదని, భారతీయులమని, తమపై బల ప్రయోగం చేయడం సరైన పద్ధతి కాదని వారు మండిపడుతున్నారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications